Uday Kiran: తెలుగు చిత్ర పరిశ్రమలో అతి చిన్న వయసులోనే కన్నుమూసిన నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఉదయ్ కిరణ్.. చిత్రం మూవీతో 2000వ సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు కూడా విజయవంతం కావడంతో.. టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లు కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనతి కాలంలోనే భారీ స్టార్డమ్ సంపాదించుకుని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే ఉదయ్ కిరణ్ కు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో పెళ్లి నిశ్చయమైంది. 2003లో ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లి వరకు వెళ్లలేదు. వ్యక్తిగత కారణాలతో నిశ్చితార్థాన్ని రద్దు చేశారు.
ఆ తర్వాత 2012లో ఉదయ్ కిరణ్ విషితను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండేళ్లకే ఉదయ్ కిరణ్ చనిపోయాడు. 2014 జనవరి 6న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్లోని తన ఫ్లాట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ మరణం అటు కుటుంబ సభ్యులను ఇటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడంతో తెలుగు చిత్రం పరిశ్రమ ఉలిక్కి పడింది. ఉదయ్ కిరణ్ మరణం వెనక కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కలేదు. ఈ క్రమంలోనే రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.
తన కూతురుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం వల్ల చిరంజీవినే ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ను తొక్కేశాడని.. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఒక వాదన ఉంది. అలాగే భార్య విషితతో ఉన్న మనస్పర్థల కారణంగా ఉదయ్ కిరణ్ చనిపోయాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ మరణం వెనక నిజాలను అతని సోదరి శ్రీదేవి బయటపెట్టింది. తన తమ్ముడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో రివీల్ చేసింది.
ఉదయ్ కిరణ్ రెండో సినిమా నువ్వు నేను అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఐదు నందీ అవార్డులను అందుకుంది. అయితే ఈ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ మరణం గురించి ఆమె మాట్లాడింది. తమ్ముడి సినిమాను మళ్లీ థియేటర్ లో చూస్తానని తాను అనుకోలేదని.. అలాంటి అవకాశాన్ని నువ్వు నేను రీ రిలీజ్ తో కలిగిందని శ్రీదేవి తెలిపింది.
థియేటర్ లో సినిమా చూస్తున్నంత సేపు.. ఉదయ్ కిరణ్ తనతోనే ఉన్నాడనే భావనలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. ఇక `ఉదయకిరణ్ చివరిగా చేసిన చిత్రాలు సరిగ్గా ఆడలేదు. ముఖ్యంగా శ్రీరామ్ సినిమాపై అతను చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ అతని అంచనాలు దెబ్బతిన్నాయి. దాంతో అతను చాలా ఒత్తిడి లోనయ్యాడు. ఫెయిల్యూర్స్ తట్టుకోలేకపోయాడు. సక్సెస్ లు .. ఫెయిల్యూర్ లు సహజం .. వాటిని గురించి అంతగా ఆలోచించకని ఎన్నో సార్లు చెప్పాను. అయినప్పటికీ ఆ నిమిషంలో అతను ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన సినిమాలు ఆడటం లేదన్న అసంతృప్తి కారణంగా ఉయద్ కిరణ్ చనిపోయాడు` అంటూ శ్రీదేవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!