YSRCP: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అనకాపల్లి లోక్ సభ స్థానానికి డిప్యూటి సీఎం బూడి ముత్యాల నాయుడును అభ్యర్ధిగా జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ ..అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.
టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను ఆ పార్టీ అధిష్టానం అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ క్రమంలో అదే సామాజికవర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడుని జగన్ ప్రత్యర్ధిగా ఎంపిక చేశారు. కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయన వరుసగా 2014, 2019 ఎన్నికల్లో మాడుగుల నుండి విజయం సాధించారు. ఆయనను అనకాపల్లి లోక్ సభ అభ్యర్ధిగా జగన్ ప్రకటించారు. ఇక మాడుగుల వైసీపీ ఇన్ చార్జిగా బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ ఉన్నారు. మాడగుల నుండి వైసీపీ అభ్యర్ధిగా ఆయన కుమార్తె బరిలో నిలవనున్నారు.
BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..