Trinayani April 15 2024 Episode 1213: మమ్మీ నేను ఆలోచనస్తున్నప్పుడు అటు ఇటు తిరగకు అని వల్లభ అంటాడు. ఏం ఆలోచిస్తున్నావ్ రా అని తిలోత్తమ ఉంటుంది. అఖండ స్వామి ఇచ్చిన కాటుక డూప్లికేట్ అనుకుంటా అని వల్లభ అంటాడు. కాటుక డూప్లికేట్ కాదురా నల్లారూప మాత్రమేకనిపించేది అక్క గత జన్మం గురించి కనిపించదు అలా కనిపించింది అంటే ఏదో కారణం అయ్యే ఉంటుంది అని తిలోత్తమ అంటుంది. పెద్దమ్మ రెండోసారి ప్రాణాం పోయిందేమో అని వల్లభ అంటాడు. అలా జరగదు రా అని తిలోత్తమ అంటుంది, అలా లేకపోతే పెద్దమ్మ జాడ తెలిసేది కదా మమ్మీ అని వల్లభ అంటాడు. ఆత్మగా వస్తే నైని మాత్రమే చూడగలదు విశాల్ హాసిని మనమందరం చూడలేం కదా అని తిలోత్తమ అంటుంది. ఎంతోమందికి అన్నం పెట్టి అన్నపూర్ణ దేవి కదా పెద్దమ్మ అందుకే అరిటాకులో కనిపించదేమో అని వల్లభ అంటాడు. అదేదో రహస్యమైనట్టు చెప్పి చెప్పినట్టు చెప్పారు కానీ డైరెక్ట్ గా మనకు విషయం మాత్రం చెప్పలేదు అని తిలోత్తమ అంటుంది. అయితే అఖండ స్వామి దగ్గరికి వెళ్దాము అని వల్లభ అంటాడు. అదే కరెక్ట్ అని తిలోత్తమ అంటుంది.
కట్ చేస్తే, గాయత్రి కి ఏమీ కాలేదు అని పావని మూర్తి అంటాడు. ఇది మాత్రం కరెక్ట్ విశాల్ గురువుగారు ఇవ్వమన్నట్టు గాయత్రీ పాప నాకు ఇచ్చేసింది ఆ ఫ్లవర్ ఇవ్వగానే వాసన చూసేసింది విశాల్ అని హాసిని అంటుంది. అంజన వేసినప్పుడు గాయత్రి పాప అమ్మ రూపంలో కనిపిస్తుంది తిలోత్తమ అమ్మకి అని నేను టెన్షన్ పడ్డాను అని వి విశాల్ అంటాడు. ఏదో ఒక కథ చెప్పి తప్పించే వాళ్ళం అని పావనమూర్తి అంటాడు. కథలు చెప్తే వినేది కాదు తిలోత్తమమ్మ అని విశాల్ అంటాడు.దీనికి ఏదో ఒక పరిష్కారమం ఆలోచించాలి అని హాసిని అంటుంది. పగ ప్రతికరం తీర్చుకునే అవకాశం వస్తుందని గురువుగారు చెప్పారు అని విశాల్ అంటాడు. అంటే గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య అని తెలిసిపోతుందా అని హాసిని అంటుంది.తెలియదు ఆరోజు ఏం జరుగుతుందని టెన్షన్ లో పూర్తి వివరాలు అడగలేక పోయాను అని విశాల్ అంటాడు. ఈలోగా నిజం తెలుసుకోవాలని రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు మనం అప్రమత్తంగా ఉండాలి అని పావనుమూర్తి అంటాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు విశాల్ హాసిని.
కట్ చేస్తే, స్వామి మీరు చెప్పినట్టే అంజనం వేసి చూసాం అని తిలోత్తమ ఉంటుంది. గాయత్రి దేవి జడ తెలిసిందా అని అఖండస్వామి అంటాడు. అది అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను స్వామి అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పెద్దమ్మ చీర కట్టుకొని కనిపించింది అని వల్లభ అంటాడు. ఆశ్చర్యంగా ఉంది ఆళ్ల ఎలా అవుతుంది అని అఖండ స్వామి అంటాడు. మాకేం తెలుసు స్వామి అని వల్లభ అంటాడు. గాయత్రీ దేవి పరకాయ ప్రవేశం చేసి ఉంటుంది అని అఖండస్వామి అంటాడు. అయితే గాయత్రి దేవి వచ్చి ఉంటుంది అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పెద్దమ్మ ఆత్మ గా వచ్చిందనుకున్నాను కానీ అందరికీ కనిపించంది అని వల్లభ అంటాడు. తను ఆత్మ కాదు తన పునర్జన్మ ఎత్తి పసిపాపగా ఉంది అని అఖండ స్వామి అంటాడు. తను పునర్జన్మతి నన్ను చంపడానికి వస్తుంది కదా అని తిలోత్తమ అంటుంది. ఆ జాడ ముందు నీకే తెలుస్తుంది తిలోత్తమ అని ఆఖండ స్వామి అంటాడు. నీ ప్రాణం తీయడమే తన లక్ష్యం అని అఖండ స్వామి అంటాడు.
అందరూ నా ప్రాణం తీస్తుంది అని అంటారు కానీ ఒక్కసారి కూడా నా ముందుకు వచే ప్రయత్నం చేయలేదు అని తిలోత్తమ ఉంటుంది. కనిపిస్తే ఏం చేస్తావ్ మమ్మీ అని వల్లభ అంటాడు. గోరుముద్దలు తినిపించే చేతితోటే పిండం పెడతాను అని తిలోత్తమ అంటుంది. ఆ మాట నిలబెట్టుకో నే ప్రయత్నం చేయి తమ లేదంటే ప్రాణాలు పోతాయి అని అఖండ స్వామి అంటాడు. వెళ్ళొస్తాం స్వామి అంటూ అక్కడినుంచి వల్లభ తిలోత్తమ వెళ్ళిపోతారు. కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ హాల్లో కూర్చుంటారు. ఇంతలో అక్కడికి గాయత్రి పాప వస్తుంది. గాయత్రి పాపా మా అక్క పేరు పెట్టుకున్నావు ఎలాగో నీ చేయి నేను ముట్టుకోనా అని తిలోత్తమ అంటుంది. ఇప్పుడు మా అత్తయ్య గాయత్రి చేయి ముట్టుకుంటే నిజం తెలిసిపోతుంది అని హాసిని విశాల్ దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. ఆడపిల్లవు కాబట్టి ముందు ఎడమ చేతికి గోర్ల పెయింట్ వేస్తాను ఇవ్వు అని తిలోత్తమ పాపకి గొర్ల పెయింట్ పెడుతుంది. కుడిచేకి పెట్టబోతుండగా హాసిని హారతి తీసుకొని వచే సరికి గాయత్రి పాప తన చేతిలో చేయి వేస్తుంది వెంటనే మంటలు వస్తాయి తిలోత్తమ లేచిపోతుంది హాసిని వచ్చి హారతి కర్పూరం కింద పడేస్తుంది.
విశాల్ గాయత్రి పాపని ఎత్తుకుంటాడు. సారీ అత్తయ్య చూసుకోలేదు అని హాసిని అంటుంది.నా చేయి కాలిపోయింది అని తిలోత్తమ హాసిని ని కొడుతుంది. నువ్వు ఎప్పుడు హారతి పల్లని తీసుకొని వచ్చావు అని వల్లభ అంటాడు.టైం బాగుంది అత్తయ్య చెయ్ మాత్రమే కాలింది అని సుమన అంటుంది. నువ్వేంటమ్మ అలా అంటావ్ అని వాళ్ళ పావని మూర్తి అంటాడు.అత్తయ్య చేస్తేఇంకొక అత్తయ్య రాదు అని హాసిని అంటుంది. నేను అలా అనలేదు అమ్మ నా మాటలో అంత అర్థం ఉందా అని పావన మూర్తి అంటాడు. హారతి తీసుకోమంటే చేతుల మీద పడేసుకుంటారు అంత పర్యాయాలు ఉంటే ఎలా అని విశాల్ అంటాడు. నాన్నలు ఇద్దరున్నారు కానీ మనకు అమ్మ ఒక్కతే అది గుర్తుపెట్టుకో అని విక్రాంత్ అంటాడు. నోరు మూసుకుంటావా అని తిలోత్తమ అంటుంది. అయినా హారతి ఎందుకు తెచ్చావు అక్క అని సుమన అడుగుతుంది. ఇప్పుడు పూజ చేసే టైం కూడా కాదు కదా అక్క అని నైని అంటుంది. ఎప్పుడు ఏది చేయాలో దీనికి తెలియదు అని దూరంగదర అంటుంది. అసలు మంట ఎలా వచ్చిందో మీకు తెలుసా అని వల్లభ అంటాడు. ఎలా వస్తే ఏంట్రా చేయతే కాలింది కదా అని తిలోత్తమ అంటుంది.
మమ్మీ చేతి మీద నిప్పులు పడితే మంట వచ్చింది అనుకుంటున్నావు అని వల్లభ అంటాడు. అన్నయ్య నిప్పులు పడితేనే కదా మంట వచ్చేది అని విశాల్ అంటాడు. అరే నన్ను చెప్పనివ్వండ్రా అమ్మ చేతిలో గాయత్రి పాప చేయివెయగా మంట వచ్చి కాలింది అని వల్లభ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాపకి నేల్ పాలిష్ వేస్తూ ఉండగా ఆ చేతితో మంట వచ్చిందంటావా అని తిలోత్తమ అంటుంది. అవును మమ్మీ ఒకసారి చూస్తే క్యాష్ చేసేస్తాను అని వల్ల అంటాడు. అవును బాబు గారు మీరు అన్నట్టే పాప చేతిలో నుంచి మంట పుట్టింది అని నైని అంటుంది. నువ్వు కూడా అలా అంటావ్ ఏంటి అక్క అని సుమన అంటుంది. నెయిల్ పాలిష్ కి అంటుకునే గుణం ఉంటుంది చిన్నపిల్లలకి ఇలాంటి నెల్ పాలిష్ వేయడమే తప్పు ఆ మాత్రం తెలియదా అని నైని అంటుంది. ఏదో తెలియక చేసి ఉంటుందిలే అమ్మ అని పావను మూర్తి అంటాడు.తిలోత్తమ అత్తయ్య నెల్ పాలిష్ వేస్తూ ఉండగా పాప చేయి తడిగా ఉంటుంది ఈలోగా హాసిని అక్క హారతి తీసుకొని రావడం తన చేతిలో పడి కాలడం జరిగింది అని నైని అంటుంది. అంతే అంటావా అని తిలోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!