ఈ సీజన్ లో డెంగ్యూ జ్వరాలు బాగా వస్తూ ఉంటాయి.ఈడిస్ ఈజిప్టై అనే ఆడ దోమ కుట్టడంతో డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది ఈడిస్ ఈజిప్టై దోమ కుట్టడంతో ఇన్ఫెక్షన్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి తీవ్రమైన నొప్పులు వస్తాయి. అందుకే డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.డెంగ్యూ సోకిన వారికి ప్లేట్ లెట్స్ కణాల సంఖ్య తగ్గిపోతుంది. మరి ప్లేట్ లెట్ కణాలు పెరగాలంటే ఎలా అనుకుంటున్నారా. డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి బొప్పాయి ఆకులు ఉపశమనాన్ని ఇస్తాయనే చెప్పాలి.
డెంగ్యూ జ్వరం తగ్గించే చిట్కా :
అలాగే బొప్పాయి పండు కూడా ఆరోగ్యపరంగా ఎన్నో ఫలితాలు ఇస్తుంది.విటమిన్ ఏ, బీ1, సి, ఈ వంటి విటమిన్స్ కూడా బొప్పాయిలో ఉంటాయి.డెంగ్యూ ఉన్న రోగులు మూడు రోజుల పాటు బొప్పాయి ఆకు రసాన్ని తాగితే కచ్చితంగా ఫలితం ఉంటుంది. ప్లేట్ లేట్ పడిపోయిన వాళ్ళకి బొప్పాయి రసం ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది.బొప్పాయి ఆకుల రసం తాగడానికి కాస్త చేదుగా ఉంటుంది కావున ఈ రసంలో కాస్త తేనె కలుపుకుని తాగవచ్చు.
బొప్పాయి రసం ఎలా తయారుచేయాలంటే..?
మరి ఈ బొప్పాయి ఆకు రసాన్ని ఎలా తయారుచేయాలో చూద్దామా.. ముందుగా లేత బొప్పాయి ఆకులను తీసుకొచ్చి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి. అలా వచ్చిన రసాన్ని ఒక చిన్న గ్లాసులోకి తీసుకుని అందులో కాస్త తేనె మిక్స్ చేసి ఉదయం, సాయంత్రం తాగితే మూడు రోజుల్లోనే ఫలితం కనపడుతుంది.అయితే ఈ రసాన్ని ఎక్కువగా తాగకూడదు. అలాగే బొప్పాయి ఆకుల రసం తగిత్ర మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.