చక్కని అందమైన మెరిసే చర్మం ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో క్రీమ్ లు పౌడర్ లు లోషన్ లు రాస్తుంటారు. చర్మానికి రాసుకునే వాటిలో ముఖ్యంగా సన్ స్క్రీన్ లోషన్ అన్నింటికంటే ముందు వరుసలో ఉంటుంది. దీనిని అన్నికాలలో వాడుతూఉంటారు.
ఈ సన్ స్క్రీన్ లోషన్ లో కూడా ఏ లోషన్ అయితే మంచిదో ఒకటికి పదిసార్లు ఆలోచించి, దాని గురించి తగిన సమాచారం తెలుకున్నాక SPF గ్రేడ్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటారు. దీని వల్ల సూర్యుడి నుంచి ప్రసరించే అతి నీలలోహిత కిరణా ల నుంచి తప్పించుకుని చర్మాన్ని రక్షించుకోవచ్చనిఎక్కువగా వాడుతుంటారు..అలా చేయడంమంచిదే. అయితే ఇందులో నూ కొన్ని చిక్కులున్నాయి.మాములుగా నే SPF 15 గ్రేడ్ సన్స్క్రీన్ వాడుతుంటాము. ఎండాకాలం లో అయితే ఈ గ్రేడ్ ఇంకాస్త పెరుగుతుంది. అయితే అదేపనిగా ఈ క్రీం వాడటం అంత మంచిది కాదని చెబుతున్నాయి పరిశోధనలు.
ముఖ్యంగా, ఎండ లో కి వెళ్లి న ప్రతీ సారి సన్స్క్రీన్ లోషన్ పదే, పదే రాయడం వల్ల సూర్యుడి నుంచి మనకు అందే విటమిన్ డి తగ్గిపోతుందని తేలింది. అలా అందక పోవడం వలన ఎముకలు బలహీనపడిపోవడం, ఊపిరితిత్తుల జబ్బులు, కండరాలు పట్టేయడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. సహజం గా మానవుని శరీరం లో ప్రతీ కణానికి విటమిన్ డీ ఏంతో అవసరం. అయితే ఎండ లో నల్లబడతామేమో అన్నఅనుమానం తో సన్స్క్రీన్ లోషన్ ఎక్కువగా రాయడం వల్ల విటమిన్ డి ని కోల్పోవద్దు అని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ని పదే పదే లేయర్ పై మరో లేయర్ అంటూ బయటికి వెళ్లిన ప్రతీసారి రాసుకోకూడదుఅని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొద్దీ మోతాదులో వాడితే ఎలాంటి సమస్య ఉండదు అని సూచిస్తున్నారు.