వైరస్ ఇప్పుడు మరింత వేగంగా సోకే అవకాశం ఉంది. అది మన వరకు రాకూడదంటే.. వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లో గడగడపడం శుభ్రత పాటించడం ఉత్తమం. అలాగే, కరోనా సోకినా, ఏమాత్రం భయపడకుండా దానితో పోరాడేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనాను మట్టు పెట్టాలి.
ఈ సందర్భంగా ఉత్తర బెంగాల్ పోలీసులు.. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. ఆవాల నూనె అంటే అవా నూనె . నిమ్మకాయ కలిపిన వేడి నీళ్లు తాగితే కరోనాను తరిమి కొట్టవచ్చని తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కరోనా నుంచి త్వరగా కోలుుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిలిగురి పోలీస్ కమిషనరేట్ తమ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.ఇటీవల కమిషనరేట్లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ బంధువుకు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్కు కరోనా వైరస్ సోకింది. దీంతో వాళ్లు నిమ్మ రసం, ఆవనూనె కలిపిన వేనీళ్లను సేవించారు. దానివల్ల వారి ఆరోగ్యం కుదుటపడిందని, త్వరగానే కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఆవనూనె, నిమ్మ రసం ఇంట్లోనే అందుబాటులో ఉంటాయని, ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు.
ఉడికించిన బంగాళ దుంపలు, అన్నంలో కాస్త పచ్చి ఆవ నూనె వేసుకుని తినండి. ఇయర్ బడ్స్ సాయంతో రోజుకు మూడు సార్లు ముక్కు రంథ్రాలకు ఆవ నూనె రాయండి. రోజుకు 4 నుంచి 5 సార్లు ముక్కు, నోటికి ఆవిరి పట్టండి. రోజుకు నాలుగు సార్లు గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండి తాగండి. రోజుకు నాలుగు సార్లు ఉప్పు నీటిని పుక్కిలించి ఊయండి. రోజూ పసుపు కలిపిన గోరు వెచ్చని పాలను తాగండి. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించడం వలన కరోనని సమర్ధ వంతంగా ఎదురుకోవచ్చు .