తేనె గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. హనీ అనే పేరు వింటే చాలు ఎవరికయినా సరే నోరు ఊరిపోతుంది.ప్రకృతి సిద్దంగా దొరికే ఔషదాలలో తేనె కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ప్రతిరోజు తెనే తీసుకోవడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకుని తాగితే బరువు ఇట్టే తగ్గుతారు.అంతేకాకుండా రాత్రి వేళల్లో పాలు తేనే కలుపుకొని తాగితే చాలా రిలీఫ్ గా ఉండడంతో పాటుగా చక్కటి నిద్ర కూడా పడుతుంది. ఇవే కాకుండా తినే తీసుకోవడం వలన ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.అయితే కొంత మంది కొన్ని సందర్భాల్లో తేనెను తీసుకోకపోవటమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.మరి ఎలాంటి వారు తేనె తీసుకుంటే మంచిది కాదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె ఎవరు తినకూడదు అంటే..?
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనెను వాడకుండా ఉంటేనే మంచిది. అలాగే తేనెను వేడి పదార్థాలతో కలిపి అసలు వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి పదార్ధాలతో కలిపి నేరుగా వాడకూడదు. కొందరు తేనెను వేడి చేస్తుంటారు.కానీ ఇలా వేడి చేసి తీసుకోవడం మంచిది కాదు.తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి.
ఏ ఏ పదార్ధాలతో తేనె తినకూడదో తెలుసా.?
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలిపి తేనెను వాడకూడదు. తేనెను ఫ్రిజ్లో ఉంచకూడదు. తేనెను అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఫలితంగా కడుపు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి. అలాగే తేనెను అధికంగా తింటే డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.