యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మరొక వైరస్ దేశ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. పక్షులలో వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ మనుషులలో కూడా హాని కలిగించే ప్రమాదం ఉందని నిపుణుల తెలియజేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ హెచ్5ఎన్1 అనేది సర్వసాధారణమైన వైరస్. ఈ వైరస్ జంతువులతో పాటు మనుషులకు కూడా సోకుతుంది. ఈ వైరస్ ను మొదటగా మనుషులలో 1997లో గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారిలో సుమారుగా 60 శాతం మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు.
సాధారణంగా బర్డ్ ఫ్లూ సోకిన వారిలో దగ్గు, డయేరియా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, తలనొప్పి, ముక్కు కారడం, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించడం వల్ల ఎక్కువమంది ప్రజలు చికెన్, గుడ్లు తినడం ద్వారా మనుషులలో కూడా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని నిపుణులు తెలియజేస్తున్నారు.
చికెన్, కోడి గుడ్లను బాగా ఉడకబెట్టి తినడం ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సరిగ్గా ఉడకని చికెన్ లేదా గుడ్లను తిన్నప్పుడు ఈ వైరస్ మనుషులలో వ్యాపించే అవకాశం ఉందని వారు తెలియజేశారు. ఈ వైరస్ పక్షులలో ఎక్కువ కాలం జీవించే ఉంటుంది, కాబట్టి పౌల్ట్రీ ఫారంలో పనిచేసే వ్యక్తులు, ఈ వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ వ్యాధిలక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలను పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ నిర్ధారణలో వ్యాధి సోకినట్లు వస్తే ఆ వ్యక్తిని కొన్ని రోజులపాటు ఐసోలేషన్ ఉంచి అతనికి చికిత్స అందిస్తారు.