రోజూ వేడి నీళ్లు తాగడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్న విషయమే . దీనికి బలం చేకుర్చుతూ రష్యా పరిశోధకులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం.
రష్యాలోని నవోసిబిరిస్క్లోని ‘వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ’కి చెందిన బృందం జరిపిన ఈ పరిశోధనల్లో వైరస్కు చెక్ పెట్టేది నీరేనని తెలుసుకున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రతో ఉండే నీరు వైరస్ను బలహీనపరుస్తుందని తెలిపారు. వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్న సంగతి తెలిసిందే. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులు, అధిక బరువు, ఊబకాయం సమస్యలను వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
అలాగే, జలుబు, దగ్గుకు సైతం వేన్నీళ్లు ఔషదంలా పనిచేస్తాయి. రష్యా పరిశోధనల ప్రకారం.. వేన్నీళ్లు కరోనాను పూర్తిగా చంపేస్తాయ్. కాబట్టి.. రోజూ వేనీళ్లు తాగడం మంచిదే.గది ఉష్ణోగ్రతలో ఉండే నీటికి కరోనా వైరస్ను అడ్డుకొనే శక్తి ఉందని, నీరు వైరస్ పెరుగుదలను అరికడుతుందని తెలిపారు. సాధారణ గది ఉష్ణోగ్రత కలిగిన నీటిలో 90 శాతం వైరస్ చనిపోవడానికి 24 గంటలు పడుతుందని పేర్కొన్నారు.
99.9 శాతం వైరస్ చనిపోడానికి 72 గంటల సమయం పడుతుందన్నారు.త్నిక్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. క్లోరైడ్ నీళ్లు కరోనాను చంపడంలో కీలకంగా పనిచేస్తాయి. క్లోరైడ్ నీటిలో కరోనా వైరస్ రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉండబోదని, ఫలితంగా దాని వ్యాప్తి తగ్గి వైరస్ తగ్గుముఖం పడుతుందని తెలిసింది. అలాగే, సముద్రపు జలాల్లో కూడా కరోనా మనుగడ సాధ్యంకాదన్నారు. నీటి ఉష్ణోగ్రతల ఆధారంగా వైరస్ నీటిలో ఎంతసేపు జీవిస్తుందనేది చెప్పగలమని పేర్కొన్నారు.కాబట్టి మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి తప్పకుండ వేడినీళ్లు తాగడం అలవాటు గా మార్చుకోండి .