Jayanagar:ఎన్నికల్లో అభ్యర్ధులు తమ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంటారు. పాలిటిక్స్ (రాజకీయం) చేయడమే కాదు పాలిట్రిక్స్ (కన్నింగ్ రాజకీయం) కూడా చేస్తుంటారు. ఈ కారణంగా ప్రజల్లో అభిమానం ఉన్న నాయకులు సైతం స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలవుతుంటారు. ఇటువంటి సంఘటనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర్ లో జరిగింది. ఇక్కడ రీకౌంటింగ్ లో ఫలితం తారు మారు అయ్యింది. ముందుగా గెలుపొందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్య రెడ్డి రీ కౌంటింగ్ తర్వాత 16 ఓట్ల స్పల్ప తేడాతో పరాజయం పాలైయ్యారు.
ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తిని స్వతంత్ర అభ్యర్ధి బీ రామమూర్తి ఓడించలేకపోయినా, కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్యరెడ్డిని స్వతంత్ర అభ్యర్ధి సౌమ్య ఎ రెడ్డి ఓడించింది. అదేంటి స్వతంత్ర అభ్యర్ధి ఓడించడం ఏమిటని అనుకుంటున్నారా..? క్కడే ఉంది ట్విస్ట్. జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు కలిపి మొత్తం 15 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డి పేరుతో స్వతంత్ర అభ్యర్ధి, బీజేపీ అభ్యర్ధి రామమూర్తి పేరుతో మరో స్వతంత్ర అభ్యర్ధి రంగంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి, బీజేపీ అభ్యర్ధి రామమూర్తి మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో జరిగింది.
శనివారం కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్య రెడ్డి విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కేవలం 160 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించడంతో బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తి రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. ఆ సమయంలో ఇద్దరు అభ్యర్ధుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. చాలా సేపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వివాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నారు. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సద్దమైయ్యారు. పరిస్థితి విషమించడంతో పోలీస్ ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలో దింపారు.
కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డి తండ్రి, కర్ణాటక మాజీ మంత్రి రామలింగారెడ్డి ఎన్నికల అధికారుల తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్ విషయంలో తారుమారు జరిగితే తాము న్యాయపోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు. రీకౌంటింగ్ లో 16 ఓట్ల తేడాతో రామమూర్తి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డికి 57,781 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తికి 57,797 ఓట్లు వచ్చాయి. 16 ఓట్ల తేడాతో సౌమ్య రెడ్డి ఓటమి పాలవ్వగా, అదే పేరుతో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధికి 320 ఓట్లు పోల్ అవ్వడం గమనార్హం. బీజేపీ అభ్యర్ధి పేరుతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధికి 203 ఓట్లు వచ్చాయి. దీంతో సౌమ్యరెడ్డిని సౌమ్యరెడ్డే ఓడించినట్లు అయ్యింది. కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించలేదు కానీ బీజేపీ ఎత్తుగడ ఇక్కడ ఫలించినట్లు అయ్యింది.
Karnataka Congress: ఉమ్మడి కృషితో కాంగ్రెస్ ఘన విజయం .. సీఎం పదవిపై సర్వత్రా ఉత్కంఠ