Corona: కరోనా సెకండ్ వేవ్ కలకలం ముగిసిపోయిన తరుణంలో ఇప్పుడు అందరి చూపు… థర్డ్వేవ్ పై పడింది. వేలాది మందిని పొట్టనపెట్టుకున్న సెకండ్ వేవ్ వైరస్ ఉద్ధృతి తగ్గినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ICMR కీలక ప్రకటన చేసింది. భారత్లో కరోనా థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని చెప్పింది. ఈ ముప్పును ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ICMR తెలిపింది.
Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్లలకు కరోనా ముప్పు తక్కువట
ఇంతకీ విషయం ఏంటంటే…
కరోనా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండకపోవచ్చునని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. మూవో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువేనని, ఒకవేళ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని స్పష్టం చేసింది. కరోనా తీవ్రతపై ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్తో కలసి ఐసీఎంఆర్ ఓ స్టడీ చేపట్టింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, మెడికల్ ఎక్స్పర్ట్ సందీప్ మండల్, సమీరన్ పండా, లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కు చెందిన నిమలన్ అరినమిన్పతి సంయుక్తంగా ఓ రీసెర్చ్ పేపర్ను రూపొందించారు. ఈ పరిశోధనలోని విషయాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమయ్యాయి.
Read More: Corona: చైనా సంచలన వార్నింగ్… కరోనాను ప్రపంచానికి అంటించిందే కాకుండా…
కొత్త వేరియంట్లో ఏం ఉంటుందంటే..
కొత్త వేరియంట్కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో రోగ నిరోధక శక్తి ని తప్పించుకోగలగితే థర్డ్ వేవ్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని రీసెర్చ్ పేపర్లో పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని కరోనా వేవ్స్ రాకూడదంటే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. రోగనిరోధక శక్తి క్షీణించటం, రోగనిరోధక శక్తిని తప్పించుకొనేలా వైరస్లో మార్పులు రావటం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.