Harihara veeramallu : క్రిష్ జాగర్ల మూడి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా హరిహర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం తన సొంత నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్పై 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటికి బాగానే అవాంతరాలు ఎదురవుతున్నాయి. కోటి రూపాయలు ఖర్చుతో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ కూలిపోయింది. దాంతో నిర్మాతకు ఆర్ధిక నష్టం తో పాటు కొన్నాళ్ళు సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.
ఆ తర్వాత ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కరోనా కారణంగా షూటింగ్ కి అంతరాయం. వకీల్ సాబ్ పూర్తి చేసి రెట్టింపు ఉత్సాహంతో హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఆయన అనూహ్యంగా కోవిడ్ బారిన పడ్డాడు. దాంతో ఇక మళ్ళీ ఇప్పటి వరకు హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవలేదు. పవన్ పూర్తిగా కోలుకున్నాడు. మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ఒకే చెప్పాడు. దాంతో క్రిష్ బృందం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కి ప్రాధాన్యం ఉంది.
Harihara veeramallu : పవన్ కళ్యాణ్ కథ విషయంలో కలగచేసుకోవడం లేదని చెప్పుకున్నారు.
పవన్ కూడా నిపుణుల పర్యవేక్షణలో దీనికి సంబంధించిన సన్నివేశాల కోసం ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే వీరమల్లు కథకి ప్రముఖ రచయితలు పనిచేస్తున్నారు. వీరికి పవన్ కళ్యాణ్ సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నాడట. కథలో పవన్ ఇన్వాల్వ్ మెంట్ కొన్ని సందర్భాలలో తప్పకుండా ఉంటుందని తెలిసిన విషయమే. అయితే గత కొంతకాలంగా ఆయన కథ విషయంలో కలగచేసుకోవడం లేదని చెప్పుకున్నారు. అయితే వీరమల్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా..కథా బలమున్న సినిమా కావడంతో పవన్ ఆయనకి తెలిసిన విషయాలను దర్శక, రచయితలకి చెబుతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.