ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియాను తీహార్ జైలులో ప్రత్యర్ధి ముఠా సభ్యులు హత్య చేసినట్లు జైలు అధికారుల మంగళవారం తెలిపారు. గ్యాంగ్ స్టర్ లు టిల్లూ పూరియా, జితేందర్ గోగి గ్యాంగ్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జితేందర్ గోగిని టిల్లు హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. 2021 లో రోహిణి కోర్టుకు హజరై జితేందర్ ను టిల్లూ గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపారు. న్యాయవాదుల మాదిరిగా నల్లకోట్లు ధరించిన గ్యాంగ్ స్టర్లు కోర్టు లోపల విచారణ జరుగుతుండగా కాల్పులు జరిపారు. దీంతో జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకులు ఇద్దరూ చనిపోయారు.
ఈ హత్య నేపథ్యంలో టిల్లు పై జితేందర్ గ్యాంగ్ కక్ష పెంచుకుంది. తీహార్ జైలులోని హై సెక్యురిటీ బ్యారక్ లో ఉన్న టిల్లూపై అదే జైలులో ఉన్న జితేందర్ గ్యాంగ్ సభ్యుడు యోగేశ్ తుండా తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. మంగళవారం ఉదయం ఐరన్ గ్రిల్స్ ను తొలగించుకుని బ్యారెక్ బయటకు వచ్చిన యోగేశ్ అవే రాడ్లతో టిల్లూ పై దాడి చేశాడు. రాఢ్లతో విపరీతంగా కొట్టడంతో టిల్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్యాంగ్ వార్ లో టిల్లుతో పాటు మరోకొరు గాయపడ్డారు. ఇంతలో జైలు అధికారులు అక్కడికి చేరుకుని యోగేశ్ ను మరో బేరక్ లోకి తరలించారు.
గాయపడిన ఇద్దరిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తిల్లు చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. తిల్లుతో పాటు గాయపడిన మరో వ్యక్తి రోహిత్ చికిత్స పొందుతున్నాడనీ, అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని డిల్లీ పోలీస్ అదనపు డీసీపీ అక్షత్ కౌశల్ తెలిపారు. జైలులో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
IT Rides: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థపై ఐటీ దాడులు