Narendra Modi: నిమ్మగడ్డ రమేష్ ను జగన్ ఇరకాటం లో పెట్టారు? ఎన్నికల కమిషనర్ మంత్రి పెద్దిరెడ్డి మీద కొరడా ఝుళిపించారు? అదిగో కొత్త పార్టీ రానుంది. ఇదిగో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్ని పంచాయితీలు మా పార్టీ గెలుచుకుంది. ఒక దంపుడు ఆంధ్రప్రదేశ్ వార్తలను ఒక్కసారి పక్కనబెట్టి, కక్షలు కార్పణ్యాలు నిండిపోయిన ఆంధ్ర ముసుగులను పక్కకు తొలగించి ఒకసారి రాజ్యసభలో జరిగిన ఓ ఆసక్తికరమైన పరిణామాల్ని ఇద్దరు పెద్ద నేతల మధ్య జరిగిన హుందా రాజకీయాన్ని ఒక సారి పరిశీలించండి. మనసులు కాస్త తేలిక పడతాయి. రాజకీయాలు ఎంత అందంగా చేయవచ్చో తెలుస్తాయి. రాజకీయ ప్రత్యర్థులు అంటే బూతులు తిట్టుకోవడం కాదని అర్థం అవుతాయి.
ఒకరినొకరు మెచ్చుకోదగిన సందర్భంలో, చిరకాల మిత్రుడు సభను వీడుతున్న సమయంలో ఎలా వ్యవహరించాలి అన్నది రాజ్యసభలో కనిపించిన ఓ గతం ద్వారా ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పదవీకాలం పూర్తి అవుతున్న సమయంలో ఆయనకు వీడ్కోలు పలికే సమయంలో ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు అందరితో శభాష్ అనిపించాయి. తన సీనియర్ సహచరుడైన గులాంనబీ కు ఆయన తన కన్నీటి ద్వారా వీడ్కోలు పలుకుతూ కాస్త ఆవేదనకు లోనై ప్రసంగాన్ని చదవడం కనిపించింది. కాంగ్రెస్ సభ్యుడిగా రాజ్య సభకు వచ్చిన గులాంనబీ కూ ప్రధాని హోదాలో ఉన్న మోదీ ఎంత అద్భుతంగా వీడ్కోలు పలికారు అంతే అద్భుతంగా గులాం నబీ ఆజాద్ సైతం మోడీ మాటలకు కరిగి కన్నీరు కార్చారు. తన ప్రసంగంలో భారత జాతి ఔన్నత్యాన్ని చెప్పడం అందరితో శభాష్ అనిపించుకుంది. ఇద్దరు నేతలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేది అందులో పెద్దల సభలో ఎంత హుందాగా వ్యవహరించారు అనేది ఈ ఘటన ద్వారా భవిష్యత్తు తరాలకు ఓ నిర్దేశకం కానుంది.
Narendra Modi: ఎప్పటికీ ఆజాద్ను మర్చిపోలేను…
గులాం నబీ ఆజాద్కు వీడ్కోలు సందేశం చదువుతున్న సమయంలో ప్రధాని మోదీ పాత సంఘటనలు ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే గులాం నబీ ఆజాద్ పరిచయం ఉందని, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కాశ్మీర్ పర్యటనకు వచ్చిన గుజరాతి పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు స్వయంగా గులాంనబీ ఆజాద్ తనకు ఫోన్ చేసి వివరాలు చెప్పారని… ఆ సమయంలో ఆయన తన సొంత మనుషులే ప్రమాదం లో ఉన్నట్లు మాట్లాడడం ఎప్పటికీ మరిచిపోలేనని మోడీ అన్నారు. పదవులు శాశ్వతం కాదు.. నాకు నిజమైన స్నేహితుడు గులాంనబీ ఆజాద్ అంటూ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేశారు. నా నిజమైన స్నేహితుడు కి నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి మీ అనుభవాలు సలహాలు సూచనలు మాకు ఎంతో అవసరం అంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉద్వేగం చెందారు. మోదీ ఓ విపక్ష పార్టీలకు చెందిన నాయకుడు మీద ఇంత ఆవేదనగా మాట్లాడడం భాజపా ఎంపీలు సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
నేను భారతీయ ముస్లిము గా గర్వపడుతున్నా
మోదీ ప్రసంగం తర్వాత గులాం నబీ ఆజాద్ సైతం తన వీడ్కోలు ప్రసంగాన్ని అద్భుతంగా అందించారు. జమ్ము కాశ్మీర్ సీఎం గా పని చేస్తున్నప్పుడు ఉగ్రదాడిలో చనిపోయిన వారి పిల్లలు తనను చుట్టేసినప్పుడు, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో తనకు కలలో నీళ్లు వచ్చాయి అని అయితే చనిపోయిన వారిని తీసుకు రాలేని పరిస్థితి లో ఉన్నాం అని చెప్పారు. ప్రతి పండుగకు తనకు ఇద్దరు నుంచి కచ్చితంగా శుభాకాంక్షలు అందుతాయని ఒకరు సోనియాగాంధీ అయితే మరొకరు ప్రధాని మోదీ తన ఆపేక్ష ను ఆయన మాటల్లో తెలియజేశారు. విభిన్నమైన పార్టీలుగా విభిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయి.. ఎన్నో విషయాల మీద వాదనలు ఉంటాయి విమర్శలు ఉంటాయి.
కానీ ఎప్పుడూ ఏ విషయం మీద మోదీ తనను వ్యక్తిగతంగా తన విమర్శలను ప్రత్యేకంగా తీసుకోలేదని ఎంతో హుందాగా చక్కగా రాజ్యసభలో తమకు అవకాశం కల్పించాలని ఆజాద్ చెప్పు కు రావడం తో పాటు భారత దేశం లో ఉన్న ముస్లింలు ఎంత భద్రంగా ఉన్నారో చూసి నేర్చుకోవాలని తాను భారతీయ ముస్లింలు గా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాం అంటూ వ్యాఖ్యానించారు. భిన్నమైన మతాలు భిన్నమైన కులాలు ఉన్నప్పటికీ భారతీయ ముస్లింలు అందరితో కలిసిమెలిసి ఉండటాన్ని ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఇతర మూలాలు లేని ముస్లిం దేశాలలో అక్కడ ముస్లిం లు తమలో తామే కొట్టుకు చచ్చిపోతున్న భారతదేశం ముస్లింలు మాత్రం ఎప్పుడు వెళ్లారని, అదే ఈ దేశపు గొప్పతనం అంటూ ఆజాద్ భారతదేశం ఔన్నత్యాన్ని చక్కగా చెప్పుకొచ్చారు.
ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో జరిగే రాజకీయ కీచులాటలు కాస్త పక్కనబెట్టి జాతీయ రాజకీయాలు, భారతదేశ అత్యున్నత అత్యున్నత చట్టసభల్లో ఏం జరుగుతుందో అక్కడ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు ఒకసారి పరిశీలిస్తే ఇలాంటి అద్భుత దృశ్యాలు మరిన్ని కళ్లకు కడతాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?