Ukraine crisis: ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు ప్రత్యేక విమానాల్లో 719 మంది విద్యార్థులు ఇండియాలో చేరుకున్నారు. తొలి విమానం శనివారం రాత్రి ముంబాయికి చేరుకోగా అందులో 219 మంది విద్యార్థులు వచ్చారు. ఈరోజు రెండు విమానాలు 490 మంది ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరినీ వారి వారి ప్రాంతాలకు తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
Read more: Ukraine Crisis: జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ప్రభుత్వ ఖర్చులతో విద్యార్ధులు స్వస్థలాలకు..
Ukraine crisis: ఉక్రెయిన్ దేశ సరిహద్దు దేశాల నుండి
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య కొనసాగిస్తున్న నేపద్యంలో ఆదేశ గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఆ దేశ సరిహద్దు దేశాల నుండి భారత విద్యార్థులను తరలించే ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ లో భారతదేశానికి చెందిన సుమారు 20,000 మంది ఉండగా అందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులే ఉన్నారు. భారత్ చేరుకున్న విద్యార్థిని విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Read more: MP RRR: వెంటాడుతున్న అరెస్టు భయం..! ఏపి పోలీసులను చూసి ఎంపి రఘురామ ఏమి చేశారంటే..?
Ukraine crisis: చివరి భారతీయ పౌరుడ్ని తరలించే వరకు
రష్యా యుద్ధంతో కకావికలం అయిన ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు పురోగతి సాధిస్తున్నారని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. సహాయక చర్యలను తానే పర్యటిస్తానని, చివరి భారతీయ పౌరుడ్ని ఉక్రెయిన్ నుండి తరలించే వరకు తమ ప్రయత్నాలు ఆగవని మంత్రి జైశంకర్ తెలిపారు.