Union Cabinet: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షాకు అదనంగా సహకార శాఖను కేటాయించినట్లు సమాచారం. ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవ్య, స్మృతి ఇరానీకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, సమాచార శాఖ, పీయూష్ గోయల్ కు ఫుడ్ అండ్ కన్జుమర్ ఎఫైర్స్ తో పాటు అదనంగా జౌళి శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ, స్కిల్ డవలప్మెంట్, జ్యతిరాదిత్య సింధియా పౌర విమానయాన శాఖ, పురుషోత్తం రూపాలకు డైయిరీస్ అండ్ మత్స్యశాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులుగా 43 మంది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది కేబినెట్ మంత్రుల్లో ఇప్పటి వరకూ సహాయ మంత్రులుగా పని చేసిన ఏడుగురికి పదోన్నతి లభించింది. వారిలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డితో పాటు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కిరణ్ రిజుజు. బీహార్ కు చెందిన ఆర్ కే సింగ్, గుజరాత్ కు చెందిన మనుసుక్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, హిమాచల్ ప్రదశ్ కు చెందిన అనురాగ్ ఠాకూర్, ఢిల్లీకి చెందిన హరిదీప్ సింగ్ పూరీ ఉన్నారు. తాజా విస్తరణతో కేంద్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య 77కు పెరిగింది. యువత, ప్రాంతాలు, సామాజిక వర్గ సమీకరణలను పరిగణలోకి తీసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు.