ఢిల్లీ: భార్యను హత్య చేసి పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చినట్లు ఢిల్లీ డిప్యూటి పోలీస్ కమిషనర్ సెజు పి కురివిల్ల తెలిపారు. ఢిల్లీలోని నిహాల్ విహార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్కు చెందిన ప్రేమ్ సింగ్ ప్రైవేటు సెటిలైట్ టివి సర్వీస్ ప్రొవైజర్ సంస్థలో పని చేస్తుండగా అతని భార్య బబ్లీ (28) బ్యూటీ పార్లర్లో పని చేస్తుంది. వీరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉండగా వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలోని బంధువుల ఇంటి వద్ద ఉంటున్నారు. సింగ్ దంపతులు వారం రోజుల క్రితం నిహాల్ విహార్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని దిగారు.
నిహాల్ విహార్ సమీపంలో మహిళ మృతదేహం ఉందన్న సమాచారంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
మద్యంకు బానిస అయిన సింగ్ తరచు భార్య బబ్లీతో గొడవ పడుతుండే వారని పరిసర ప్రాంతాల వారిని విచారించగా తెలిసిందని పోలీస్ అధికారి కురివెళ్ల చెప్పారు.
మృతురాలి భర్త ప్రేమ్ సింగ్ పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టి రాజస్థాన్లో అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామని కురివిల్ల తెలిపారు. భార్యను హత్య చేసి రాత్రంతా మృతదేహం పక్కనే పడుకుని ఉదయం లేచి సింగ్ పరారయినట్లు తమ విచారణల ో తెలిసిందని పోలీస్ అధికారి కురివిల్ల చెప్పారు.