ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, ప్రకాశం జిల్లాలు దాదాపు టోటల్ లాక్డౌన్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తరుణంలో కృష్ణా జిల్లాలో కూడా పరిస్థితి అలానే ఉంది. రాష్ట్రంలో ఉన్న కొద్ది వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి బయట పడుతున్న గాని ప్రజలలో ఏమాత్రం భయాందోళన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సారి టోటల్ ఏపీ లాక్ డౌన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతూ ఎక్కడికక్కడ వైరస్ చైన్ తెగిపోయేలా వ్యవహరిస్తూ జగన్ సర్కార్ చాలా వరకు కంట్రోల్ చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.
ఇటీవల కేంద్రం దేశంలో ఏ రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఎంత ఉంది అన్న దాని విషయంలో ఏపీలో కేవలం ఎనిమిది శాతం ఉన్నట్టు లెక్కల్లో తేలింది. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 122 శాతం ఉండటంతో ఆ రాష్ట్రంలో ప్రజలందరిలో భయాందోళన నెలకొంది. కానీ అటువంటి పరిస్థితి ఏపీలో లేదు. అయినా గాని లాక్ డౌన్ నిబంధనలు లెక్కచేయకుండా మాస్కులు మరియు సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తరుణంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
దీంతో మరోసారి టోటల్ ఏపీ లాక్ డౌన్ చేసి కరోనా నిర్ధారణ పరీక్షలు ఉన్న కొద్దీ పెంచితే పూర్తిగా వైరస్ ని నియంత్రించే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే కర్నూలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. మరోపక్క పశ్చిమగోదావరి జిల్లా మరియు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కూడా భయంకరమైన పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి స్టేట్ మొత్తం లాక్ డౌన్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.