ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు విమాన పైలెట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. తన విధులను సక్రమంగా నిర్వహించనందుకు గానూ ఏయిర్ ఇండియా ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్ కు మూడు లక్షల జరిమానాను విధించింది డీజీసీఏ.
మరో పక్క ఈ ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రను నాలుగు నెలల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేదం విధించింది. అయితే డీజీసీఏ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని నిందితుడి తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. అంతర్గత విచారణ కమిటీని తాము గౌరవిస్తామనీ కానీ ఆ కమిటీ సూచించిన కారణాలతో తాము విభేదిస్తామని చెప్పారు. 9ఏ లో కూర్చున్న వ్యక్తి 9 సీలో కూర్చున్న ప్రయాణీకురాలిపై ఎలా మూత్ర విసర్జన చేశాడన్న దానిపై కమిటీ సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. కమిటీ నిర్ణయంపై తాము అప్పీల్ చేశామనీ, తమకు దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.
గత సంవత్సరం నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్ లో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్ర అనే వ్యక్తి మూత విసర్జన చేశారని బాధితురాలు విమాన సిబ్బందికి తొలుత ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె న్యాయం కోసం ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు ఆమె లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు లో విచారణ నిమిత్తం నిందితుడుని మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరగా, డిల్లీ పోలీసుల వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం అతనికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు పంపింది.
సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు దక్కని ఊరట .. జీవో నెం.1పై విచారణలో సుప్రీం కోర్టు ఏమన్నదంటే..?