టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు కుదరడం.. సీట్లు కూడా పంచుకోవడం అయిపోయింది. కొందరికి తగ్గాయి. మరికొందరికిపెరిగాయనే వాదన ఎప్పుడూ ఉంటుంది. పొత్తులు అంటే ఇంతే. ఎక్కడో ఒక చోట సర్దు కోక తప్పదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ పొత్తులు పెట్టుకునేందుకు వెనుక జరిగిన అనేక విషయాలు ప్రస్తుతం ప్రజలకు తెలియాల్సి ఉంది. ఇది చెప్పకుండా.. ఉంటే ప్రజలు కూడా పొత్తులను ఎంత మేరకు రిసీవ్ చేసుకుంటారనేది కష్టమే.
కాబట్టి.. ఇప్పుడు పొత్తుల వెనుక ఎంత జరిగింది? ఎన్ని ప్రయత్నాలు జరిగాయి? అనేది ప్రస్తుతం చర్చకు వస్తున్న విషయం. ప్రధానంగా పొత్తుల కారణంగా.. ఎక్కువగా ప్రత్యక్ష నష్టం జనసేనకే జరుగుతోంది. ఆ పార్టీనాయకులు బహిరంగంగా చెబుతున్నా.. చెప్పకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఇదే ఉంది. అయితే.. ఇలా ఏరికోరి పొత్తులు పెట్టుకోవడానికి ప్రధానంగా ముందుకు వచ్చింది జనసేన అధినేత పవన్. ఢిల్లీ చుట్టూ.. ఆయన అనేక సార్లు తిరిగారు.
కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పాయింట్ మెంటు ఇస్తామని ఇవ్వకుండా తిప్పి పంపిన ఘటనలు కూడా రెండేళ్ల కిందట చర్చకు వచ్చాయి. ఇక, టీడీపీకి, బీజేపీకి మధ్య 2019లో ఎర్పడిన భారీ గ్యాప్ను ఫిల్ చేయడంలో పవన్ తన శక్తినంతా ధార పోశారు. కొన్ని గంటల తరబడి.. అమిత్ షా ఆఫీసు ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇదంతా పవన్ పడిన కష్టమే. ఇక, ఇటీవల కూడా.. టీడీపీని ఎన్డీయే కూటమిలో చేర్చుకునేందుకు ఆయన పట్టుబట్టారు.
రోజుల తరబడి శ్రమించారు. సో.. మొత్తానికి పొత్తు సాధించారు. ఇక, ఇప్పుడుబీజేపీ టికెట్ల విషయంలో పట్టుబడితే.. తనే ఒకటి రెండు తగ్గించుకుని పవనే త్యాగం చేశారు. సరే.. ఇదంతా ఎందుకు? ఆయన స్వార్థం ఏమైనా ఉంద? అంటే.. లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఖచ్చితంగా ఇదంతా చేసింది పార్టీ కోసం.. పార్టీని నమ్ముకున్న వారి కోసమే.
మరోసారి వైసీపీ వస్తే.. జనసేన నాయకులు కనీసం బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదని.. వారిని కాపాడుకునేందుకే వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో సేనాని దిగి వచ్చి.. పొత్తులకు పరోక్ష నాయకత్వం వహించారు. దీనిని అర్ధం చేసుకుని, క్షేత్రస్థాయిలో దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే.. అంతిమ విజయం జనసేనదే అనడంలో సందేహం లేదు.