KGF : “కేజిఎఫ్” KGF సినిమాతో దేశంలో టాప్ హీరోల చూపును తనవైపు తిప్పుకున్నడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో చాలామంది టాప్ హీరోలు ప్రశాంత్ నీల్ తో చేయటానికి అప్పట్లోనే ముందుకు రావడం జరిగింది. ఈ తరుణంలో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్.. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో “సలార్” సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేయటం మాత్రమే కాకుండా రిలీజ్ డేట్ కూడా చెప్పటం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ నీల్ మెగా కాంపౌండ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ ఆఫీసులో పేటీఎం కావటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇద్దరి మధ్య సినిమాకి సంబంధించిన భారీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు, ఒక విధంగా చెప్పాలంటే “బాహుబలి” స్థాయిలో ఈ సినిమా ఉండేవిధంగా సరికొత్త స్క్రిప్టుతో ప్రశాంత్ నీల్.. బన్నీతో సిట్టింగ్ కి కూర్చున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల తో నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ఓకే అయితే ఆ సినిమా స్టార్ట్ చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.