కరోనా వైరస్ వృత్తి దేశవ్యాప్తంగా చాలా తీవ్రంగా కొనసాగుతోంది. అసలు ఎటువంటి బేధ భావం లేకుండా ఈ వైరస్ భారతదేశంలోని ప్రజలందరినీ కబలిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పోలీసులు అందరూ దీని బారిన పడగా కొద్దిరోజుల క్రితమే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి కూడా కోవిడ్ పాజిటివ్ అని రావడం గమనార్హం.
అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా కరోనా బారిన పడ్డారు. అతనికి కూడా కోవిడ్ పాజిటివ్ అని రావడంతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అతనికి ఎవరివల్ల ఈ వైరస్ సోకింది అన్న విషయంపై ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎడ్యూరప్ప వయస్సు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇప్పుడు అతని పరిస్థితిని తీవ్రత చేసే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రి మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆ రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతా ఆశిస్తోంది.