Breaking: ఏపీ వర్షాకాల సమావేశాలు తేదీ ఖరారు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఈ నెల 21 లేదా 22 వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. దాదాపు ఐదు రోజులు లేదా వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించి మళ్లీ.. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ మాసంలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహమ్మారి కరోనా కారణంగా .. విడతల వారీగా అసెంబ్లీ సమావేశాలు జరపాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో శాసనమండలిలో పూర్తి మెజారిటీ అనగా 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా గెలుచుకున్న తర్వాత.. శాసనమండలిలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం.