అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు.
సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డిజిపి ఆర్పీ ఠాకూర్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
అయితే సిఎస్ సమీక్ష నిర్వహించడంపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియతో సిఎస్కు ఏం సంబంధమని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
‘ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక కలెక్టర్లు, ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులంతా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఉంటారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్పై సమీక్ష నిర్వహించే బాధ్యత ఎన్నికల అధికారిది. అలాగే అలాంటిది ఎన్నికల అధికారే సిఎస్ సమీక్షలకు హాజరుకావాలని కలెక్టర్లను ఆదేశించటం ఏమిటి? కౌంటింగ్పై సిఎస్ సమీక్షించడం ఏమిటి..?’అని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తామే ఈ సమీక్ష సిఎస్ అధ్యర్యంలో నిర్వహించామని ఎన్నికల అధికారి ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.