(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై నిర్వహించిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ప్రాజెక్టులు, నీటి పంపిణీపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వారి వారి వాదనలు వినిపించాయి.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కెసిఆర్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ తమ వాదనలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టుల పర్యవేక్షణ తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. దాదాపు గంటన్నర పాటు ఈ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రధానంగా నాలుగు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. కౌన్సిల్ లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు కొద్దిసేవటిలో ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్ వెల్లడించనున్నారు.