Artificial Blood: మానవులలో ఎన్నో రకాల బ్లడ్ గ్రూప్లు ఉంటాయని మనకు తెలిసిందే. ఎప్పుడైనా ఎవరికైనా రక్తం ఎక్కించాలి అనుకున్న సమయంలో ముందుగా ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ ను తెలుసుకుని ఆ తరువాత అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తారు.
ఒక్కోసారి మనకి సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకడం కస్టం అవుతుంది. అటువంటి సమయంలో యునివర్సల్ డోనార్ గా పిలవబడే O -ve రక్తాన్ని ఎక్కిస్తారు. కానీ O -ve బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇలా అవసరం ఉన్నప్పుడు తగిన సప్లై లేక పోవడంతో పరిశోదకులు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.
ఈ సమస్యకు జపాన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక పరిష్కారాన్ని కనిపెడుతున్నారు. ఇటీవల జపాన్ లోని తొకోరోజవా నగరంలో గల నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్ లో అధునాతన పద్దతులతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. మామూలు రక్తం లో ఉండే లాగానే ఈ రక్తం లో కూడా ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలు అలాగే రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్స్ ఉంటాయట. ఈ పరిశోదన కోసం వారు రక్తహీనత కలిగిన 10 కుందేళ్లను తీసుకుని ఈ రక్తాన్ని వాటికి ఎక్కించారు. ఇలా పరిశోదన జరిపిన కుందేళ్లల్లో ఆరు కుందేళ్ళు ప్రాణాలతో ఉన్నాయి మరియు నాలుగు చనిపోయాయి.
ఈ కృత్రిమ రక్తం కుందేళ్ళ ప్రాణం నిలిపిన విదంగానే మనుషుల ప్రాణం కూడా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ రక్తం అన్ని బ్లడ్ గ్రూప్లకు సరిపోతుందట. అలాగే ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కృత్రిమ రక్తం ఏకంగా ఓ ఏడాదిపాటు నిలువ ఉంటుందట. అలాగే ఈ రక్తాన్ని కుందేళ్లకు ఎక్కించిన సమయంలో కానీ ఆ తర్వాత కానీ వాటిల్లో ఎలాంటి సైట్ ఎఫెక్ట్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!