Children eyesight : ఈ కాలంలో చాలామంది కంటి చూపు Children eyesight సమస్యలు ఎదురుకుంటున్నారు.వయసు తో సంబంధం లేకుండా ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సులో నే కళ్ళ జోడు పెట్టుకుని తిరగవలిసి వస్తుంది.
పిల్లల ఎదుగుదలలో కళ్ళు, కంటిచూపుముఖ్యమయిన అంశంగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా పిల్లల కళ్ళను పరీక్షలు చేయిస్తూండాలి. కళ్లకు ఏమైనా సమస్యలు, వ్యాధులు వుంటే వెంటనే తగిన చికిత్స చేయించాలి. పిల్లలు తమంతట తాము వారికిఉన్న కంటి చూపు సమస్యలను తెలుసుకోలేరు. కనుక తల్లి తండ్రులు వారి చూపులను గమనించుకుంటూ తగిన పరిష్కారం తెలుసుకోవాలి. మంచి కంటి వైద్యులచే వారి కళ్ళను నుఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ ఉండాలి.
అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, కంటి చూపు పెరగాలన్న కొన్ని రకాల పదార్థాలను క్రమం తప్పకుండా మన ఆహారం లో తీసుకోవాలి. వాటిగురించి తెలుసుకుందాం. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినడం వలన దృష్టి లోపం సమస్య రాకుండా చేసుకోవచ్చు.
కోడిగుడ్డు,యాపిల్స్,క్యారెట్స్, పాలకూర, బీట్ రూట్, బ్రొకలి, వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తప్పకుండ పిల్లల ఆహారం లో ఉండేలా చూసుకోవాలి .
ప్రతిరోజూ అయిదారు బాదం పప్పును నీటి లో నానబెట్టుకుని పొట్టు తీసితినడం వలన కంటి సమస్యలు తగ్గిపోతాయి. బాదం పప్పు ఒక కప్పు, కొన్ని సోంపు గింజలు కొద్దిగా చక్కెర తీసుకుని అన్నింటిని కలిపి మెత్తగా పొడి చేసుకుని ఈ పొడిని ఒక టేబుల్ స్పూను మోతాదు లో తీసుకుని గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి, ప్రతిరోజూ రాత్రిపూట నిద్ర పోయే ముందు తాగించడం వలన కొన్ని రోజుల్లోనే కంటి చూపు పెరుగుతుంది.
విటమిన్ సి ఉసిరికాయల్లో సమృద్దిగా ఉంటుంది. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లా పని చేస్తుంది. కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేయడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఒక గ్లాసు నీటి లో ఒక టేబుల్ స్పూను ఉసిరికాయ జ్యూస్ని కలిపి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తాగిన కంటి సమస్యలు తేలికగా తగ్గించుకోవచ్చు.