సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజినీకాంత్ పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తన కొత్త పార్టీకి సంబంధించిన విధివిధానాలు సిద్ధాంతాలు డిసెంబర్ మాసం చివరిలో అన్ని తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ అభిమానులు రజనీ ప్రకటన పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంత మాత్రమే కాక తమిళనాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి తలైవా అని డిసైడ్ అయిపోయారు. చాలా మంది ప్రముఖులు రజినీకాంత్ సన్నిహితులు ఖచ్చితంగా ప్రజా సేవ చేసే విషయంలో రజిని రాజకీయాల్లోకి రావడం సంతోషమని కచ్చితంగా ఆయన రాణిస్తారని చెప్పుకొస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా రజినీకాంత్ కి కోర్టు నుండి నోటీసులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో 2018 మే 22వ తారీఖున తూత్తుకుడి లో స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వెనకాల కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని అప్పట్లో రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆందోళన జరుగుతున్న సమయంలో పోలీసులు కాల్పుల్లో దాదాపు 13 మంది చనిపోయారు. దీంతో అప్పట్లో చేసిన రజిని వ్యాఖ్యలపై విచారించడానికి అరుణ జగదీషన్ నోటీసులు ఇప్పుడు జారీ చేయటం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తూత్తుకుడి స్టెరిలైట్ వ్యవహారం మీద చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరుకావాలని సమాన్లు జారీచేసింది. జనవరి 19 తారీకున అరుణ జగదీషన్ ఎదుట హాజరుకావాలని నోటీసులు రజినీకాంత్ కి అందాయి.