“కాదు ఏది కవితకు అనర్హం” అన్నారు శ్రీశ్రీ. దొంగలు మాత్రం దానిని మార్చి రాస్తూ చోరీలకు కాదు ఏది అనర్హం అంటూ మార్చేశారు. ఒకప్పుడు వారం రోజులపాటు రెక్కీ నిర్వహించి కన్నం వేసే దొంగలు, ఇపుడు సరికొత్త టెక్నాలజీ ని వినియోగించి నిమిషాల వ్యవధిలో దోపిడీ కి పాల్పడుతున్నారు. అయితే ఇప్పటిదాకా బ్యాంకు అకౌంట్స్ ని హ్యాక్ చేసి ఖాతాలో డబ్బులు అపహరించిన సైబర్ నేరగాలు. ఇంకొక అడుగు ముందుకు వేసి, దోపిడీ చేయడానికి డబ్బులే అవసరం లేదు అని నిరూపిస్తూ, పెద్ద కంపెనీ ల ని టార్గెట్ చేసి దానిలోని కస్టమర్ డేటా ను ఉపయోగించి కూడా నేరాలకు పాల్పడుతున్నారు.
అసలు విషయానికి వెళ్తే గ్రోసరీ ఈ–కామర్స్ లో మంచి గుర్తింపు పొందిన బిగ్ బాస్కెట్పై సైబర్ నేరగాళ్లు వల వేశారు. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల డేటాను దొంగలించారు. ఈ డేటా మొత్తని రూ. 30 లక్షలకు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. డార్క్ వెబ్ను మానిటర్చేస్తున్నప్పుడు బిగ్బాస్కెట్కు చెందిన డేటా అమ్మకానికి ఉండడం గమనించిన సంస్థ, బెంగళూరు సైబర్క్రైమ్ సెల్కు ఫిర్యాదు చేసింది. 15 జీబీ ఉన్న ఈ డేటా లో యూజర ఈ–మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్లు, అడ్రస్, పుట్టిన తేది, లొకేషన్, లాగిన్ అయిన ఐపీఅడ్రస్ వంటి డేటా ఉందని తెలిపింది.
ఈ డేటాను రూ. 30 లక్షలకు అమ్మకానికి పెట్టారు. సుమారు రెండు కోట్ల మంది యూజర్లడేటా ఇందులో ఉండొచ్చు’ అని సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబల్ తన బ్లాగ్ లో పేర్కొంది. ఈ దాడి గురించి కొన్ని రోజుల కిందట తెలియడం తో సైబెల్ కి కంప్లైంట్ చేసాం అని సంస్థ తన స్టేట్ మెంట్ లో చెప్పింది. క్రెడిట్ కార్డ్నెంబర్లు వంటి యూజర్ల ఫైనాన్షియల్డేటా ఎప్పూడు స్టోర్ చేయమని తెలిపింది. ఈ డేటా దొంగతనానికి గురి కాలేదని నమ్ముతున్నామని పేర్కొంది. ఈ దాడిని అంచనావేస్తున్నామని, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్లు ట్ చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని సంస్థ తెలిపింది.