హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఆర్టిసి సమస్యపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తొందరపాటు చర్యలు తీసుకొన్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కార్మికులపై కక్షపూరిత వైఖరితో వ్యవహరించడం మంచిదికాదనీ, సానుభూతితో వ్యవహరించాలనీ కిషణ్ రెడ్డి హితవు పలికారు. ప్రజలకు సేవ చేసే ఆర్టిసిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. పేద డ్రైవర్లు, కండక్టర్ల జీవితాల గురించి ఆలోచించాలని కిషణ్ రెడ్డి కోరారు.
previous post
next post