(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కడప: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంను సమర్థిస్తూ శనివారం కడప నగరంలో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ఈ ర్యాలీని ప్రారంభించారు. సిఏఏ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు బిజెపి వెల్లడించింది. నగరంలోని మున్సిపల్ మైదానం నుండి అంబేద్కర్ కూడలి వరకూ ఈ ర్యాలీ నిర్వహించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, సినీనటి కవిత, నెహ్రూ యువకేంద్ర జాతీయ అధ్యక్షుడు విష్ణువర్థనరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.