(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హత్యకు గురయిన తన సన్నిహిత అనుచరుడు సురేంద్ర సింగ్ అంత్యక్రియలలో బిజెపి ఎంపి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. అమేఠీ నియోజకవర్గంలోని బరౌనీలో సురేంద్ర సింగ్ను శనివారం రాత్రి కాల్చి చంపిన వార్త తెలియగానే ఉదయం స్మృతి అక్కడకు చేరుకున్నారు. సురేంద్ర సింగ్ కుటుంబ సభ్యులను ఊరడించారు. సురేంద్ర సింగ్ పాడెను ఆమె స్వయంగా మోశారు.
ఈ ఎన్నికలలో అమేఠీలో స్మృతి తరపున సురేంద్ర సింగ్ చాలా చురుకుగా ప్రచారం చేశారు. సురేంద్ర సింగ్ పడ్డ కష్టాన్ని ఆమె బహిరంగంగానే కొనియాడారు. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. సురేంద్ర సింగ్ను ఇంటి వద్దే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హంతకులను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు దొరికాయని పోలీసులు అంటున్నారు.