Brahmamudi April 11 2024 Episode 381: కావ్య శ్వేతని కలవడం వెన్నెలను ఎలాగైనా పట్టుకోవాలని ఇద్దరూ అనుకోవడం జరుగుతుంది శ్వేతా కావ్యలా చర్చ ఈరోజు కూడా కొనసాగుతూ ఉంటుంది అప్పట్లో రాజు వెన్నెల కోసం చాలా ఆర్థికంగా సహాయం చేశాడని మూడు నెల తర్వాత వెన్నెల కనిపించకుండా పోయిందని ఏమైందో ఎవరికీ తెలియదని శ్వేత చెప్తుంది అంటే ఆ తర్వాత ఆయన వెన్నెలను వెతికి పట్టుకొని ఉంటారా?వెన్నెల అయినా కలిసి వుంటారా?ఆమెతో బిడ్డని కని ఉంటారా? అని కావ్య అనుమానముగా శ్వేతను అడుగుతుంది. నాకైతే తెలియదు నేను వెన్నెల పేరు విని కూడా చాలా రోజులైంది అని చెప్తుంది శ్వేత. టెన్త్ వాళ్లందర్నీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తే అక్కడికి ఖచ్చితంగా వెన్నెల వస్తుంది. రాజ్ కి విషయం తెలియకుండా నువ్వే రాజ్ ని అక్కడికి తీసుకురావాలి అని కావ్య అంటుంది. ఈ ప్లాన్ గురించి మా ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అంటుంది. సరే అంటుంది శ్వేతా. నేను రాజ్ మాటలు విని నీకు నువ్వు చాలా ఇబ్బంది పెట్టాను అప్పటినుంచి నాకు నీ వైపు చూడాలన్న గిల్టీగా ఉంది నీకు సారీ చెబుదామని అనుకుంటున్నాను అని అంటుంది.
ఇక కావ్య అయ్యో నీ తప్పేముందిలే శ్వేత ఆయన నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఆయన కోసం అలా చేశావు అదేం పట్టించుకోవద్దు ముందు మనం వెన్నెల గురించి ఆలోచించాలి. ఇదే కనుక తేరి తే వెన్నెల కనక మనకి దొరికితే ఇక నువ్వు నాకు చాలా సహాయం చేసిందని అవుతావు అని అంటుంది కావ్య. నువ్వు నన్ను క్షమించేసావో నాకంటే చాలు అంటుంది శ్వేతా మొత్తానికి కావ్య శ్వేతలు ఇద్దరు కలిసి వెన్నెలని వెతకడానికి గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇక మరోవైపు అపర్ణాదేవి సుభాష్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది సుభాష్ అప్పటికే రాజ్ బాధ్యత మొత్తం కళ్యాణ్ కి అప్ప చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపర్ణాదేవి వచ్చి భర్తతో తన బాధను చెప్పుకోవడం మొదలు పెడుతుంది.
నాకు ఇంట్లో ఉండాలని లేదండి అని అంటుంది. ఎందుకు అని అడగరేంటి అని కూడా అపరినే అంటుంది ఎందుకో నాకు తెలుసు నాకు ఇంట్లో ఉండాలని లేదు ఇద్దరం ఒకటే బాధ పడుతున్నాం కాబట్టి నాకు తెలుసు అని అంటాడు. ఇంట్లో ఉమ్మడి కుటుంబం కలిసిపోయి ఉందాం అని అనుకున్నాను కానీ ఇలా ఇంట్లో వాళ్ళే నాకు నరకం చూపిస్తున్నారు వాళ్ళు లేనిపోని మాటలు అని నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది అపర్ణ. రాజ్ మనం చెప్తే వినడు ఇప్పుడు వాడున్న పరిస్థితుల్లో మన మాట వినేటట్లు లేడు. అలాంటప్పుడు మనం ఎవరికీ ఏం సమాధానం చెప్పలేము అని అంటాడు అయితే మీలా నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను నేను చేయాల్సింది నేను చేస్తాను రాజ్తో నేను మాట్లాడి తీరాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రాజ్ బిడ్డని ఎత్తుకొని మేడ మీదకు వెళుతూ ఉంటాడు అపర్ణాదేవి నా స్థాయి పడిపోయింది ఆజ్ఞాపించే స్థితి నుంచి అర్థం చేస్తికి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు అని రాజు నీ కోపంగా అడుగుతుంది నువ్వు క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మమ్మీ అని చెప్పి బాబుని తీసుకొని మేడ మీదకు వెళ్ళిపోతాడు. అపర్ణ కి ఏమీ అర్థం కాదు ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక మరోవైపు ఇందిరా దేవి టెన్షన్ పడుతూ గుమ్మం దగ్గరే కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే శ్వేత కావ్య ఇద్దరు మాట్లాడుకొని కావ్య ఇంటికి వస్తూ అమ్మమ్మ గారిని చూసి ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది నా గురించి తర్వాత వెన్నెల గురించి తెలిసిందా అని అడుగుతుంది వెన్నెల గురించి ఇంకా తెలియలేదు అమ్మమ్మ గారు అదే పనిలో ఉన్నాము అని అంటుంది. నువ్వు వెన్నెల్ని కనుక్కునే సమయంలో ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అపర్ణ దాని గురించి రుద్రా నివారణ మాటలు ఇందిరా దేవి కావ్య తో చెప్తుంది ఇక కావ్య మీరేం టెన్షన్ పడకండి అని లోపలికి వెళుతుంది. అపర్ణ అప్పటికే చాలా కోపంతో ఉండడంతో కాఫీ తీసుకొచ్చిన కాఫీని కాఫీ ఒకటే ఇస్తే సరిపోతుందా అని అంటుంది. అందుకే టాబ్లెట్ కూడా తీసుకొచ్చాను అంటుంది కావ్య టాబ్లెట్ వేసుకుంటే గంటకు తగ్గుతుంది కానీ ఇంటికి పట్టిన అరిష్టం ఎలా పోతుంది ఎప్పుడు పోతుంది అని ఆవేశంగా పైకి లేచి మాట్లాడడం మొదలు పెడుతుంది అపర్ణ. కావ్యకి ఏమీ అర్థం కాక బాధగా చూస్తూ ఉంటుంది ఈ ఇంటికి కష్టాలు నష్టాలు అన్ని నువ్వు అడుగుపెట్టిన తర్వాత నుంచే మొదలయ్యాయి నీ మీద ఇష్టం లేదు కాబట్టే నా కొడుకు పక్కదారి పట్టి ఉంటాడు వీటన్నిటికీ కారణం నువ్వే నిజంగా నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే ఇంకా ఎందుకు ఈ చూర్ పట్టుకొని వేలాడుతున్నావ్ అందరూ అనుకుంటున్నట్లు ఈ ఐశ్వర్యాన్ని వదులుకోలేక నీ పుట్టింట్లో గతిలేక నా అంటూ కావున నాన్న మాటలు అంటుంది అదంతా దూరం నుంచి వింటున్న ఇందిరా దేవి ఒకసారి గట్టిగా అపర్ణ అని అరుస్తుంది. కావ్య బాధగా నించొనే ఉంటుంది. అపర్ణ దేవి దగ్గరికి ఇందిరాదేవి వచ్చి అసలు నీకు బుద్ధుందా అని అడుగుతుంది.
ఇందిరా దేవి అపర్ణని కడిగి పారేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావ్ నీకైనా అర్థమవుతుందా అపర్ణ ఆడపడుచు ఏదో అన్నదని తోడికోడలు నవ్విందని నీ కోడలు మీద నిందలు వేయడం మొదలు పెట్టావా ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా వాళ్ళ ఇంట్లో గతిలేక నా ఏం గతి లేదు వాళ్ళింట్లో ముగ్గురు ఆడపిల్లలు పెంచిన ఇల్లు అది అలాంటి ఇంట్లో ఈ అమ్మాయి వెళ్లి ఉంటే గతిలేక అవుతుందా అయినా ఇంతకాలం పెంచిన వాళ్ళు ఇకమీదట వెళితే పెంచకుండా ఉంటారా ఐశ్వర్య మాస్తి అంటే ఏంటి ఇలాగా కోడల్ని చులకన చేయడమా అని అపర్ణాదేవిని ఇందిరా దేవి కోప్పడుతుంది. నీ కొడుకుని నువ్వేమీ అనలేక ఆడపడుచు ఏదో అన్నదని కోడలు మీద ఏమీ నోరెత్తి మాట్లాడు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. కవికి ఎవరూ లేరు అనుకుంటున్నావా? ఆమె వైపు మాట్లాడడానికి నేనున్నానని మర్చిపోయావా, నీకే కనక అంతర్ మధురం జరిగి నీ మనసు నీకు ఏది చెప్తుందో అది ఆలోచించు వెళ్లి ఈ అభాగ్యురాలి మీద వచ్చి పడకుండా ముందు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించి కావే గోదారి చూపించు లేదంటే ఇకనుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఆపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది.రాజ్ అదంతా విని లోపలికి వెళ్ళిపోతాడు.కావ్య ఏంటి అమ్మమ్మ గారు అంతా ఆవేశంగా మాట్లాడారు అనిఅంటుంది. మీ అత్త కూడా ఏంటి కోడలే అనే విషయం మర్చిపోయింది మీ అత్తకి నేనున్నానన్న విషయం గుర్తు చేయాలి కదా అందుకే అలా మాట్లాడాను అయినా నీ వైపు నేనున్నానని తెలియకపోతే వాళ్ళు నిన్ను ఇంకా ఎక్కువ మాటలు అంటారు అని ఇందిరా దేవి నువ్వు అనుకున్నది చెయ్యి నీ వెనక నేనున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. కావ్య కూడా బాధగా రాజు గదిలోనికి వెళుతుంది.
ఇక రాజ్ పైకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కావిని అన్న మాటలన్నీ గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక కావ్య లోపలికి రాగానే నేను నీకు ఒక మాట చెప్తాను వింటావా అని అంటాడు. ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను ఏ మాట వినలేదు అన్ని మాటలు విన్నాను కదా అని అంటుంది. ఈ మాట నీకు నచ్చకపోవచ్చు అని అంటాడు నా భర్త ఒక బిడ్డను తీసుకువచ్చి ఈ బిడ్డకు నేనే తండ్రి అని చెప్తే ఏ భార్య అయినా ఆ మాట నచ్చుతుందా కానీ నాకు నచ్చింది కదా విన్నాను కదా అని అంటుంది. అయితే అవమానాలు కష్టాలు నీకెందుకు ఇవన్నీ ఇక్కడే వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇప్పుడే వెళ్లిపో అని అంటాడు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటుంది నీకు ఇక్కడ సౌభాగ్యమా వైభోగమే ఏమీ లేదు కింద జరిగిందంతా నేను విన్నాను నీకు ఎందుకు ఈ అవమానాలు వెళ్లి నీకంటూ ఇల్లు ఉంది నీకంటూ ఆత్మ అభిమానం ఉంది వాటన్నిటిని చంపుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నీ దారి నువ్వు చూసుకో అని అంటాడు నేను మంచి వాడిని కాదు అని అంటాడు ఆ మాట నేను కదా అనాల్సింది. నేను ఆ మాట నీతో అనలేదు అని అంటుంది. నీకే కళ్ళ ఎదురుగా సాక్ష్యం కనిపిస్తున్నా కానీ ఇంకా ఎందుకు ఇక్కడ పట్టుకొని వేలాడుతున్నావు అని అంటాడు సరే అయితే ఇంటికి వెళ్తాను అని అంటుంది కావ్య వెంటనే రాజ్ షాక్ అవుతాడు.అదేంటి అలా చూస్తున్నారు ఇంత తొందరగా ఎలా ఒప్పుకుంది అనుకుంటున్నారా కానీ నేను ఇలా వెళ్ళను నాకు తేడాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అత్తగారు ఏదో అన్నదని భర్త ఏదో అన్నాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు నేను ఒక్కసారి గడప దాటాను అంటే మళ్ళీ జీవితంలో ఇంటి గడప తొక్కను అని కావ్య అక్కడినుంచి వెళ్ళిపోతుంది. రాజ్ బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటాడు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంటికి గెస్ట్ గా ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ వస్తూనే అపర్ణ దేవుని పలకరిస్తుంది అంతలో రాజ్ బిడ్డతో కిందకి దిగుతూ ఉంటాడు. బాబుని చూసి ఆవిడ మీకు మనవడు పుట్టాడా నాకు అసలు విషయమే తెలియదే అనిఅంటూ ఉండగా కావ్య కాఫీ తీసుకొని వస్తే నీకు సిజేరియన్ జరిగిందా లేక నార్మల్ డెలివరీ అమ్మ అని అడుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రుద్రాణి మీరు కరెక్ట్ గా అడిగారు కానీ రాంగ్ పర్సన్ అడిగారు ఈ మాట అడగాల్సింది కావ్యని కాదు రాజ్ ని అని అంటుంది. అదేంటి బిడ్డ పుడితే ఆడవాళ్ళనే కదా డెలివరీ గురించి అడిగేది అని అంటే కానీ మా ఇంట్లో అలా కాదు అదే మ్యాజిక్ అని చెప్తుంది.
Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!