విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ‘తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి రెడ్డి, కన్న తల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు అయినా.. నాదే పైచేయి అంటాడు. దొంగ పనులు చేసి దొరికిపోయి చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడతాడు చిట్టి రెడ్డి. చరిత్ర మర్చిపోయారా విజయసాయి రెడ్డి గారు? ’ అని ప్రశ్నించారు.
‘మంగళగిరి ఎన్నికల్లో నారా లోకేష్ని ఓడించడానికి వైఎస్ కుటుంబం మొత్తం రంగంలోకి దిగాల్సివచ్చింది. పెయిడ్ ఆర్టిసులు కూడా అక్కడే మకాం వేసారు కదా మర్చిపోతే ఎలా? అన్నట్టు ఒక్క మంగళగిరిలో వైసీపీ గెలుపు కోసం మీరు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే బయట పెట్టినందుకు ధన్యవాదాలు’ అంటూ బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.
మంగళగిరి ఎన్నికల్లో లోకేష్ ని ఓడించడానికి వైఎస్ కుటుంబం మొత్తం రంగంలోకి దిగాల్సివచ్చింది. పెయిడ్ ఆర్టిసులు కూడా అక్కడే మకాం వేసారు కదా మర్చిపోతే ఎలా. అన్నట్టు ఒక్క మంగళగిరిలో వైకాపా గెలుపు కోసం మీరు 200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే బయట పెట్టినందుకు ధన్యవాదాలు.(2/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 17, 2019