Love: ఈ మధ్య ప్రేమ పెళ్లి పేర్లతో చాలామంది యువత మోసపోవడం మనం చూస్తున్నాం. పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మించి అవతలి వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి వారిని అడ్డంగా మోసం చేస్తున్నారు. ఇటీవల ఈజీ మనీ కి అలవాటు పడిన ఓ యువతీ చేసిన పనికి పోలీసులు నివ్వెరపోతున్నారు. ఆ యువతీ తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అని చెప్పి ఓ వ్యాపారిని బుట్టలో వేసుకుంది. ఆ వ్యాపారి నుంచి ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు కాజేసింది. వివరాలలోకి వెళితే….
వీరారెడ్డి అనే వ్యక్తి ఓ పేరుమోసిన వ్యాపారి. ఈ యువతి ఆ వ్యాపారిపై కన్నేసి తన మాటలతో అతనినినమ్మించింది. పెళ్లి చేసుకుందాం అంటూ పలుమార్లు ఆ వ్యాపారిని అడిగి అతడిని మరింతగా నమ్మించింది. ఆమె మాటలను నిజం అని నమ్మిన ఆ వ్యాపారి ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆమె మొత్తం రూ.11 కోట్లు కాజేసిన తరువాత ఆమె ప్రవర్తన లో మార్పు వచ్చింది. అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఇక దీనితో అసలు విషయం అర్ధం అయిన వీరారెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రయించి వారికి జరిగిందంతా వివరించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ యువతిని అరెస్ట్ చేసి దర్యాప్తు చెయ్యగా ఆమెకు ఉన్న లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు మొత్తం రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా ఆమె ఇప్పటికే చాలామందిని మోసం చేసినట్లు సమాచారం. ఈమెతో పాటుగా ఇంకొక ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఈమె కారణంగా ఇంకా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవలిసిందిగా పోలీసులు సూచించారు. ఇక ప్రేమ వలలో పడి రూ.11 కోట్లును ఇచ్చిన ఆ వ్యాపారిని చూసి అందరూ విస్మయానికి గురవుతున్నారు.