ఇద్దరు పిల్లలు ముద్దు అంతకు మించి వద్దు అన్నది ఒకప్పుడు దేశంలో మారుమోగిన కుటుంబ నియంత్రణ నినాదం. అదే మాదిరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు జిల్లాలో ఇద్దరు ముగ్గురు సమర్థులైన నాయకులు ఉంటే చాలు మళ్లీ దూసుకుపోతానంటున్నారు.
2019 కేవలం ఇరవై మూడు సీట్లకు టిడిపి పరిమితమవడం తెలిసిందే. 38 సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఇదే అత్యంత ఘోరపరాభవం. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసిపి టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది అలాగే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా మిగలకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటోంది.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాళి గిరి కరణం బలరామ్ వాసుపల్లి గణేష్ బాబులు వైసీపీ వైపు వెళ్లిపోయారు.ఇక పలువురు టిడిపి మాజీ ల సంగతి వేరుగా చెప్పనవసరం లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే టిడిపి పరిస్థితి గోచరంగా ఉంది. 2024 ఎన్నికల నాటి కైనా టిడిపి ఉంటుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఇంతటి క్లిష్ట సమయంలోనూ విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు టిడిపి సీనియర్ నాయకులు వైసీపీని దీటుగా ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు.
వీరిలో వాసుపల్లి గణేష్ ఇప్పటికే జంప్ అయ్యారు.గణబాబు గంటా శ్రీనివాసరావు ఈ రోజో రేపో గోడ దూక బోతున్నారు.ఇక మిగిలిన ఏకైక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం వైసిపి గాలానికి చిక్కటం లేదు సరికదా టిడిపికి పూర్తి విధేయంగా పనిచేస్తున్నారు.విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కారు.. అమరావతికి అండగా నిలుస్తుందంటూ టీడీపీపై చేస్తున్న విమర్శలను బలంగా తిప్పి కొట్టటమే కాదు.. రాజధాని విషయంలో టీడీపీ వైఖరి విశాఖ వాసులకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని సమర్థంగా చెప్పే ప్రయత్నాన్ని వెలగపూడి సాగిస్తున్నారు.అలాగే సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఈ మధ్య దూకుడు పెంచారు.
రాష్ట్ర మంత్రి జయరాం పై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు.కొత్త కొత్త కుంభకోణాలను బయటపెడుతున్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి నేతలు ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఉంటే మళ్లీ టిడిపికి ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చునని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీని ఎదుర్కోగల సత్తా గల దమ్మున్న టిడిపి నాయకుల కోసం జిల్లాలో చంద్రబాబు టార్చ్ లైట్ తో గాలిస్తున్నారు. అందరూ అనుకున్నంత బలహీనంగా చంద్రబాబు లేరని ఆయన ఏర్పాట్లలో ఆయన ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.