టీడీపీ పార్టీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ క్యాడర్ ని డైలమాలో పడేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే స్థానిక ఎన్నికల విషయంలో చంద్రబాబు వైఖరి అదేవిధంగా అచ్చెన్నాయుడి వైఖరి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో కరోనా సెకండ్ వేవ్ గురించి చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నికలు పెట్టకూడదని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇటీవల పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు స్థానిక ఎన్నికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఎన్నికలు నిర్వహించాలని మాట్లాడుతూ మీడియా సమావేశం కూడా నిర్వహించారు.
అలా అయితే మద్యం దుకాణాలు ఎందుకు తెరిచారు…? అక్కడ వ్యాపించని కరోనా, ఎన్నికలు జరిపితే వ్యాపిస్తుందా..? అంటూ వైసీపీ పార్టీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు జరిపితే ఇబ్బందులు తప్పవని, కరోనా ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
మరోపక్క అధికార పార్టీ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఎన్నికలంటే భయపడుతున్నారు అంటూ అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల విషయంలో పార్టీ కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అదేవిధంగా చంద్రబాబు వైఖరి చాలా భిన్నంగా ఉన్నట్లు టిడిపి పార్టీలో టాక్. మొదటిలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కీలకమైన విషయాలలో ఇదే పంథా కొనసాగితే, పార్టీకి డ్యామేజ్ అవ్వడం గ్యారెంటీ అని పార్టీలో ఉన్న నేతలు అంతర్గతంగా చర్చించుకుంటూనట్లు సమాచారం.