Chandrababu: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ఆరంభమైందనీ, జగన్ ను ఓడించడానికి జనం సిద్దంగా ఉన్నారని, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ – జనసేన పార్టీదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా కదిలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజా కోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారన విమర్శించారు. ఆయనకు అభ్యర్ధులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దమని ఆయన తెలిపారు. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అని ప్రశ్నించాలన్నారు. వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిత్రమయ్యాయని తెలిపారు. నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అని అంటున్న జగన్ పన్నులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అప్పులు ఎందుకు చేశావు జగన్ అని నిలదీశారు. చేసిన అప్పులు ఎవరు కడతారు అని ప్రశ్నించారు. దోచిందంతా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్కిస్తామని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల తర్వాత వైసీపీ జెండా పీకేయడం ఖాయమని అన్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ధి ఏమిటి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. ఒక్క పరిశ్రమ తెచ్చాడా అని ప్రశ్నించారు. తాను రాయలసిమ బిడ్డనే, నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమేనని చంద్రబాబు అన్నారు. టీడీపీ అయిదేళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.12,500 కోట్లు ఖర్చు చేశామని, ఈ అయిదేళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలంకు ద్వారా 120 టీఎఁసీలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని అన్నారు. రాయలసీమను పంట్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశానని అయితే దుర్మార్గులు అంతా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల్లో జగన్ పీహెచ్ డీ చేశాడని విమర్శించారు. రూ.10లు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడమే ఆయన పాలసీ అని విమర్శించారు.
YS Jagan: ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే – వైఎస్ జగన్