Cine Producer Rajendra Prasad: టాలివుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ (86) కన్నుమూశారు. సినీ ఎడిటర్ గౌతంరాజు మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో గౌతంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఈ విషాదం నుండి సినీ వర్గాలు తేరుకోకముందే ఈ రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ మరణించారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఉదయం తుదిశ్వాస విడిచారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాజేంద్ర ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దివంగత ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరువాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు రాజేంద్ర ప్రసాద్. కురక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర సినిమాలు మాధవి పిక్సర్స్ బ్యానర్ పై నిర్మించినవే.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!