YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించారు. కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ ఫ్రంట్ పార్క్ ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రూ.12.3 కోట్లతో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పార్క్ కు జలవిహార్ గా సీఎం జగన్ నామకరణం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. రూ.369.89 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. 80వేల మంది ప్రజలకు ముంపు నుండి రక్షణ లభిస్తుందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. 369 కోట్లతో 2.26 కిలో మీటర్ల మేర వాల్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు.
కృష్ణానదికి ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నది ఒడ్డున ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. రిటైనింగ్ వాల్ తో పాటు అహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించేలా పార్క్ ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి దేవినేని అవినాష్, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, కల్పలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా.. కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!