Congress TDP: కాంగ్రెస్, టీడీపీ మరో సారి జత కట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్దమైయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది తెలిసిందే. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు పొత్తులు పెట్టుకుంటుంటాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి మొదటి నుండి పడదు. టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభావంతో టీడీపీ తీవ్రంగా దెబ్బతిన్నది. టీడీపీలోని సీనియర్ నేతలు, క్యాడర్ అధికార టీఆర్ఎస్ వైపు మళ్లిపోయింది.
తెలంగాణలో వర్క్ అవుట్ కాలేదు
దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ వర్క్ అవుట్ కాలేదు. ఆ తరువాత ఏపిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు దూరం పెట్టారు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే మళ్లీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు పొడిచింది. అంటే అది ఇక్కడ ఏపిలోనో, లేక తెలంగాణలో కాదు.
అండమాన్ నికోబార్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో
తాజాగా అండమాన్ నికోబార్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్చి 6వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో మరో సారి కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అండమాన్ నికోబార్ లోని రెండు పార్టీల నేతలు సమావేశమై పొత్తుతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. వార్డులను పంచుకున్నారు. పొత్తుల విషయంపై కాంగ్రెస్ నేత రంగలాల్ హల్దార్, టీడీపీ నేత మాణిక్యాలరావు ఒప్పందం చేసుకున్నారు.
Read More: JINNAH TOWER Issue: జిన్నా టవర్ వద్ద ఎగిరిన మువ్వన్నెల జెండా..వివాదం ముగిసినట్లే..