గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం దాదాపు పడిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్న సామాన్య జనం నుండి మాత్రం పెద్దగా స్పందన రాలేదు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పించిన గాని ఓటర్లు ఏ మాత్రం ప్రతి స్పందించలేదు. ఇటువంటి తరుణంలో గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గటం పై సంచలన వ్యాఖ్యలు చేశారు సైబరాబాద్ సిపి సజ్జనార్.
జరిగిన గ్రేటర్ ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గటం చాలా బాధాకరమని సమాజమంతా ఆలోచించాలని పేర్కొన్నారు. మొత్తం ఎన్నికల శాతం పరిశీలిస్తే దాదాపు 40 నుంచి 45 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదు కావడంతో తీవ్రస్థాయిలో ఓటర్లపై చాలా మంది ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ సమాజంలో ఓటు వేసిన వారికి ఒక లాగా వెయ్యని వారికి మరో లాగా ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు.
ఓటు హక్కు వినియోగించిన ప్రతి పౌరుడికి ప్రభుత్వం నుండి లభించే ప్రోత్సాహాలు అందించాలని అంతేకాకుండా స్పెషల్ బెనిఫిట్స్ కల్పించాలని సూచించారు. ఇక ఓటు వేయని వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కనిపించకుండా కఠినంగా వ్యవహరించాలని దీనిపై ఎన్నికల కమీషన్ యంత్రాంగం ఆలోచించాలని సూచించారు. ఇలాంటి విషయాలపై రాజకీయ పార్టీల సీనియర్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు పర్యటనలు ఓటు హక్కు పై కనిపించిన గాని జనాలలో స్పందన రాకపోవడం పట్ల సీపీ సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చదువుకున్న యువత కూడా గ్రేటర్ ఎన్నికల్లో పెద్దగా పాల్గొనలేదన టాక్ వినిపిస్తోంది.