అమరావతి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్కు మద్దతిచ్చిన నితీష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. “ గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సలహాదారులుగా మీరు వ్యవహరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలకు దాసోహమంటూ లోక్ సభ, రాజ్యసభలలో ఎన్నార్సీ, సీఏఏ బిల్లులకు మద్దతిచ్చారు. ఏపీ అసెంబ్లీ లోనైనా ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా తీర్మానం చేయమని జగన్మోహనరెడ్డికి సూచించాలని ప్రశాంత్కిషోర్కు కోరుతున్నాం”అంటూ సీపీఐ రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
previous post
next post