“భయానికి మినీంగ్ తెలియని బ్లడ్ నా రాదీ” అనేమాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ.. నిజ జీవితంలో ఆ వ్యక్తికి లేకపోయినా.. ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబానికి, జనానికి అది కొన్ని సందర్భాల్లో అతి ఎక్కువగా ఉంటుంది ఈ భయం! భయం అనే మాట, తలొగ్గాలి అనే ఆలోచన, తగ్గాలి అనే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో జగన్ మదిలోకి కూడా రావనేది ఆయన జీవితం గురించి తెలిసిన వారెవరికైనా ఇట్టే అర్ధమయ్యే విషయం. ఈ క్రమంలో జగన్ ముందు ఒక కీలక పరీక్ష ఎదురై నిల్చుంది
అవును… జగన్ మరో సంచనలన నిర్ణయం… రచ్చబండ కార్యక్రమం! అది కూడా సెప్టెంబరు నెలలో! ఈ ఒక్కమాటతో జగన్ ను కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి, కట్టుకున్న భార్యతో కలిపి రాష్ట్ర ప్రజలు అంతా కంగారుపడిపోతున్నారు. కారణం… యాంటీ సెంటిమెంట్! అవును… పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలపై ఒక అంచనాకి వచ్చిన వైఎస్సార్… నాడు “రచ్చబండ” కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా సెప్టెంబర్ 2 అనే తేదీని ఆ కుటుంబానికే కాదు, రాష్ట్రానికే ఒక దుర్దినంగా మిగిల్చి వెళ్లిపోయారు! దాంతో… ఆ నెల అన్నా ఆ కార్యక్రమం పేరన్నా హడలిపోతున్నారు జగన్ ఫ్యామిలీ & ఫ్యాన్స్!
సరిగ్గా పదేళ్ల తర్వాత అదే నెలలో, అదే పేరున్న కార్యక్రమానికి, అదే వాయుమార్గం ద్వారా జగన్ ముందుకు వెళ్లడంపట్ల అంతా ఆందోళన చెందుతున్నారంట. అయితే… “మొండోడికి” అవేమీ పట్టడం లేదని అంటున్నారు. “మీరు మరీ కాదు కూడదు అంటే… “రచ్చబండ”ను కాస్త “గ్రామసభ”గా మార్చుకోండి… వాయు మార్గం వద్దంటే రోడ్డు మార్గాన్నే ఫైనల్ చేయండి.. కానీ అనుకున్న నెలలో, అనుకున్న సమయానికి జనం దగ్గరకు వెళ్లాలని” అంటున్నారట జగన్! జనం విషయంలో జగన్ మొండి తనం బాగా తెలిసిన కుటుంబ సభ్యులు ఈ విషయంలో మరో మాట చెప్పలేక.. సరే అన్నారని తెలుస్తోంది!