సెప్టెంబర్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో సెప్టెంబర్ 30న వస్తున్న ‘పొన్నియన్ సెల్వన్ 1’ సినిమాకి పోటీగా ధనుష్ నటించిన “నేనే వస్తున్నా (Naane Varuven)” సినిమా సెప్టెంబర్ 29న రిలీజవుతోంది. ఈ విషయంపై సినీ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా కలెక్షన్లపై సెల్వ-ధనుష్ సినిమా పెద్ద ప్రభావం చూపుతుందని టెన్షన్ పడుతున్నారు. భారీ బడ్జెట్తో, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ యాక్టర్స్తో పొన్నియన్ సెల్వన్ తెరకెక్కనుంది. అయినా మణిరత్నం డైరెక్షన్ కాబట్టి దీనిపై తమిళనాడులో తప్ప ఎక్కడా పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. ధనుష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ కాబట్టి నార్త్ బెల్ట్లో దీనిపై బాగానే అంచనాలున్నాయి. అయినా కూడా పీఎస్ 1 ఒక ఎపిక్ డ్రామా కాబట్టి ఈ సినిమాతో పోటీ పడడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి.
ఎందుకంత రిస్క్
ధనుష్ ఇంత పెద్ద రిస్క్ చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో వచ్చే నవరాత్రి ఉత్సవాలు, దసరా పండగల వల్ల చాలామంది ఇంటిపట్టునే ఉంటారు. ఈ పండుగ రోజుల్లో జనాలంతా థియేటర్లకు పోటెత్తే అవకాశం ఉంది. చదువుకునే యువత కూడా ఈ రోజుల్లో పదుల సంఖ్యలో సెలవులు పొందుతారు. అందుకే ధనుష్ పండగకి ముందు సినిమాని విడుదల చేసి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని బాక్సాఫీసు వద్ద బాగా డబ్బులు కొల్లగొట్టాలని అనుకుంటున్నాడు. నిజానికి ఈ ఫెస్టివల్స్ సమయం అక్టోబర్ ఫస్ట్ వీక్ విడుదలయ్యే సినిమాలు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ “నేనే వస్తున్నా” సినిమాకి మంచి టాక్ వస్తే నెక్స్ట్ వీక్ ఎన్ని సినిమాలు వచ్చినా భయపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ధనుష్ తన సొంత రాష్ట్రలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు.
ఫ్యాన్స్ మధ్య వార్
ఈ విషయం గురించి ధనుష్, విక్రమ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గట్టి పోటీనే జరుగుతుంది. లెజెండ్రీ డైరెక్టర్కి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా కావాలనే పోటీకి వస్తునందుకు కార్తీ అభిమానులు కూడా ధనుష్ పై ఫైర్ అవుతున్నారు.