సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా మహేష్ కెరీర్ లో 27 వ సినిమాగా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సర్కారు వారి పాట అన్న టైటిల్ ని అనౌన్స్ చేసి మహేష్ బాబు లుక్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవంగా అయితే ఈ సినిమా ఎప్పుడో చిత్రీకరణ మొదలవ్వాల్సింది. కాని కరోనా కారణంగా సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఒక భారీ బ్యాంక్ సెట్ ని నిర్మిస్తున్నారట మేకర్స్.
ఇక ఈ సినిమాని మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీ.ఎం.బీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్ధిక నేరస్థుడిగా కనిపించబోతున్నారట. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే టైటిల్ తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ రాగా ఆ క్రేజ్ ని రెట్టింపు చేసేందుకు చిత్ర యూనిట్ ఆగస్టు 9 న ఒక భారీ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కావడంతో సర్కారు వారి పాట నుండి ఒక వాయిస్ ఓవర్ వీడియో ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రై ఇవ్వాలని మేకర్స్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ వాయిస్ తో పాటు వీడియో టీజర్ కూడా వదలబోతున్నట్టు సమాచారం. అలాగే ఇన్నాళ్ళు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని చెప్పుకొస్తున్నారే గాని అధికారకంగా ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడలేదు. అయితే మహేష్ పుట్టినరోజే ఆ సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని మరో న్యూస్. మొత్తానికి సర్కారు వారి పాట సర్ప్రైజ్ లు అదరబోతున్నాయనమాట.