హైదరాబాద్ బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో కంపెనీలో ఒక్క సారి గా మంటలు ఎగిసిపడ్డాయి. వింధ్య ఆర్గానిక్ కంపెనీలో ఈ ప్రమాదం చేసుకుంది. భారీ పేలుడుతో కార్మికులు పరుగులు తీశారు. పలువురు కార్మికులు గాయాలపాలైయ్యారు. గాయపడిన కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కంపెనీ లోపల కొంత మంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
రియాక్టర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించిన వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. సకాలంలో ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ఘటన పై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ భోజనం విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. పది మంది కార్మికులు గాయ పడగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించామన్నారు. ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయిదు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు. పేలుడు ధాటికి రేకులు ఎగిరి బయట పడ్డాయి.