ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి చెందిన ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్కార్ట్ వాహనం బోల్తా పడినట్లు సమాచారం. మంత్రి కాన్వాయ్ లోని ఓ టైరు పగిలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
టైరు పగిలినవెంటనే పెద్ద శబ్దంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుండి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడిన ముగ్గురిని హయత్ నగర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలినేని శక్తి, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా కొనసాగుతున్నారు.