సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహానాల వైపు తయారీ సంస్థలు అడుగులు వెస్తున్నాయి. ఇప్పిటికే చాలా రకాల ఎలక్ట్రిక్ వాహానాలు అంబాటులోకి వచ్చాయి. వినియోగదారులు సైతం డీజీల్, పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహానాల కోనుగోలు పైనా మొగ్గు చూపుతున్నారు. పర్యవరణానికి చాలా తక్కువ మొత్తంలో హాని కలిగించే ఈ వాహానాల ఉత్పత్తికి ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తోంది.
ఇక టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహానాల విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు అందుబాటు ధరలోనే వీటిని తీసుకొస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహానాలు తయారీ దారు హీరో ఎలక్ట్రిక్ సైతం నూతన హంగులతో స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. పండగల సీజన్ను క్యాష్ చేసుకునే క్రమంలో భారీ ఆఫర్లు కూడా ప్రకటించింది.
తమ ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ల కోనుగోలుపై రూ. ఐదు వేల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే, వడ్డీలేని రాయితీ సదుపాయాలను సైతం వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపింది. ఇది ఎంపికచేసిన ప్రాంతాల్లోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందనీ, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించింది.
కొత్తగా కొనుగోలు చేసేప్పుడు ఎదైనా ద్విచక్ర వాహనాన్ని ఎక్సేంజ్ చేసుకోవచ్చుననీ, దీనికి అదనంగా ఐదు వేల రూపాయల వరకూ డిస్కౌంట్ సైతం అందిస్తామని హీరో ఎలక్ట్రిక్ సంస్థ తెలిపింది. నవంబర్ 14 వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా తమ సంస్థకు 500లకు పైగా డీలర్లు ఉన్నారనీ, మరిన్ని వివరాలకు వారిని సంప్రదించాలని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ అవకాశాన్ని వీరు కూడా సద్వినియోగం చేసుకోండి మరి !