IND vs ENG : టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేటితో ప్రారంభమవుతోంది. కొద్ది నిమిషాల క్రితమే ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదటి టీ-20 లో ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రెండవ అర్ధ భాగంలో మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఇండియా బౌలర్లకు ప్రతికూలం అన్నది ఇంగ్లాండ్ వాళ్ళ ప్లాన్.
ఇంగ్లాండ్ టి20 లో ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా. పదవ వికెట్ వరకూ సమర్థవంతంగా హిట్టింగ్ చేయగల బ్యాట్స్మెన్ వాళ్ల సొంతం. భారత్ తో పోలిస్తే ఇంగ్లాండ్ బాగా స్ట్రాంగ్ గా ఉంది. అయితే సొంత గ్రౌండ్లో బరిలోకి దిగడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. రెండు జట్లూ తమ వ్యూహాలతో బరిలోకి దిగాయి. అయితే కోహ్లీ మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇంగ్లాండ్ వారిని తన తెలివితో బోల్తా కొట్టించాడు.
నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి అడిగినప్పుడు… ధావన్ టీమ్ లో మూడవ ఓపెనర్ అని… రోహిత్ శర్మ, రాహుల్ టీమిండియా ఓపెనర్లు గా మొదటి ఛాయిస్ అని కోహ్లీ చెప్పడం జరిగింది. దీంతో అందరూ కొద్దిరోజులు ధాబన్ బెంచ్ కే పరిమితం అవుతాడు అని భావించారు. అయితే టాస్ పడిన తర్వాత టీమ్ ప్రకటించిన కోహ్లీ రెండు మ్యాచ్ లో రోహిత్ శర్మ కు రెస్ట్ ఇచ్చాం అని చెప్పి ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చాడు.
గత ఐపీఎల్ లో ధావన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సెంచరీలు కొట్టి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. అయితే రోహిత్ శర్మ ఉంటాడని ఇంగ్లాండ్ జట్టు అతనికి వ్యూహాలు రచించి ఉంటుంది. కానీ ధావన్ పై శ్రద్ధ పెట్టి ఉండదు. ఒక్కసారిగా అతను టీమ్ లోకి వచ్చేసరికి ఇప్పుడు ఇంగ్లాండ్ అతనికి ఎటువంటి ప్లాన్ లేకుండా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని ఎంత మేరకు టీమిండియా సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందో వేచిచూడాలి.